News November 19, 2025
అఖండ పల్నాడు రారాజు అనుగు రాజు యాదవ్ గురించి తెలుసా..?

పల్నాడు చరిత్ర అనగానే బ్రహ్మనాయుడు, నాగమ్మ గుర్తుకొస్తారు. అయితే అఖండ పల్నాడును పరిపాలించిన అనుగురాజు యాదవ్ పాత్ర కీలకమైనది. ఈయనకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కుమారుడు మలిదేవుడు మాచర్ల రాజధానిగా బ్రహ్మనాయుడు మంత్రిగా, చిన్న భార్య కుమారుడు నలగామ రాజు గురజాల రాజధానిగా నాగమ్మ మంత్రిగా పరిపాలించారు. దాయాదుల మధ్య జరిగిందే పల్నాటి యుద్ధం అనుగరాజ గుర్తుగా పిడుగురాళ్లలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు.
Similar News
News March 12, 2026
వైద్యులపై ఎంజీఎం సూపరింటెండెంట్ సీరియస్

ఎంజీఎంలో వైద్యుల సమయపాలనపై సూపరింటెండెంట్ హరీష్ చంద్రా రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఓపీ విభాగంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉదయం 9:30 గంటలైనా జనరల్ మెడిసిన్, సర్జికల్, ఆర్థో, ఏఎంసీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తప్పవని సంబంధిత వైద్యులను హెచ్చరించారు.
News March 12, 2026
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: కలెక్టర్ హరిత

ASF జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ హరిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ దండే విఠల్, ఏఎస్పీ చిత్తరంజన్, ఎమ్మెల్యే కోవలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పవిత్ర రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
News March 12, 2026
ప్రగతి ప్రణాళికను జయప్రదం చేయాలి:ఎమ్మెల్సీ

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ కోరారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో గురువారం మున్సిపల్ ఛైర్మన్లు, ఉప ఛైర్మన్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రణాళిక అమలుపై వివరాలు తెలియజేశారు.


