News November 19, 2025
వినాయకుడిని ఏ సమయంలో పూజించడం ఉత్తమం?

బుధవారం వినాయకుడి పూజలకు శ్రేష్ఠం. ఉదయంతో పోల్చితే సాయంత్ర పూజల వల్ల విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. స్కంద పురాణం ప్రకారం.. సంధ్యా సమయంలో స్వామివారిని పూజిస్తే మనలోని ప్రతికూల శక్తులన్నీ హరించుకుపోతాయి. కొబ్బరి నూనె దీపం వెలిగించి, 21 గరికెలు సమర్పించి, గణేశుడి పంచరత్న స్తోత్రాన్ని పఠిస్తే.. బుద్ధి చతురత, వాక్శుద్ధి కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
Similar News
News March 28, 2026
పాత్రలు కడిగే లిక్విడ్స్తో ఆరోగ్యానికి ముప్పు!

పాత్రలు కడిగే లిక్విడ్స్లో ఉండే ఐసోథియాజోలినోన్ వంటి రసాయనం వల్ల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా క్లీన్ చేయని పాత్రలపై ఇవి ఉండిపోవడం వల్ల చర్మ వ్యాధులు, అలర్జీలు, జీర్ణకోశ సమస్యలు తలెత్తవచ్చని వివరించారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్నపిల్లలపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. వీటికి బదులుగా రసాయనాలు లేని <<19500089>>ప్రత్యామ్నాయాలు<<>> వాడాలని సూచించారు.
News March 28, 2026
పాత్రల జిడ్డు వదిలించే వంటింటి చిట్కాలు!

పాత్రల జిడ్డు వదిలించేందుకు రసాయనాలతో కూడిన సబ్బులే వాడాల్సిన పనిలేదు. వంటింట్లో ఉండే వస్తువులతోనూ పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు. నిమ్మరసం, బేకింగ్ సోడా మిశ్రమం మొండి జిడ్డును వదిలిస్తుంది. వెనిగర్ వాడటం వల్ల బాక్టీరియా నశించి పాత్రలు మెరుస్తాయి. అలాగే బియ్యం కడిగిన నీరు, బూడిదను వాడి పాత్రలను క్లీన్ చేయొచ్చు. వీటివల్ల చేతులకు అలర్జీలు రావు. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? COMMENT
News March 28, 2026
234 స్థానాల్లో 164 చోట్ల DMK పోటీ

TNలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోయే స్థానాలను అధికార పార్టీ DMK ప్రకటించింది. మొత్తం 234 స్థానాల్లో 164 చోట్ల బరిలోకి దిగుతున్నట్లు CM స్టాలిన్ తెలిపారు. మిగతా 70 చోట్ల తమ మిత్ర పక్షాలు పోటీలో నిలుస్తాయన్నారు. అందులో 28చోట్ల కాంగ్రెస్ బరిలోకి దిగుతుందని చెప్పారు. మిగతా స్థానాలను DMDK, VCK, CPI తదితర పార్టీలు పంచుకుంటాయని తెలిపారు. ఏప్రిల్ 23వ తేదీ TNలో ఎన్నికలు జరగనున్నాయి.


