News November 19, 2025

బాలికను రెండేళ్లుగా చీకటి గదిలో నిర్బబంధించిన తల్లి

image

చీకటి గదిలో రెండేళ్లుగా మగ్గుతున్న ఓ బాలికకు న్యాయాధికారి చొరవతో విముక్తి లభించింది. ఈ ఘటన ఇచ్ఛాపురంలోని చక్రపాణి వీధిలో నిన్న వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి మరణంతో మానసికంగా కుంగిపోయిన తల్లి ఆడపిల్లను బయటకు పంపితే ఏం జరుగుతుందోని భయంతో ఇలా బంధించింది. స్థానికుల సమాచారంతో న్యాయాధికారి, రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులు వీరిద్దర్నీ బయటకి తీసుకొచ్చారు. పరిస్థితి బాగాలేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు.

Similar News

News March 20, 2026

మందస: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

మందస మండలంలోని కొర్రాయి గేటు వద్ద తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం..సోంపేట నుంచి కాశీబుగ్గ వైపునకు వస్తున్న యువకుడు బైక్ అదుపు తప్పి పక్కన రక్షణ ఇనుమును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మందస ఎస్సై కృష్ణ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్‌ బాడీని పోస్టుమార్టానికి హరిపురం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.

News March 20, 2026

‘అర్జీలను సత్వరం పరిష్కరించాలి’: శ్రీకాకుళం కలెక్టర్

image

దివ్యాంగుల అర్జీల పరిష్కారంలో జాప్యం జరగరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్‌ను కలెక్టర్ దివ్యాంగుల సంక్షేమశాఖ, ఏడీబీ శైలజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ గ్రీవెన్స్‌లో 7 దరఖాస్తులు స్వీకరించారు. వీటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News March 20, 2026

శ్రీకాకుళం జిల్లాలో యువకుడి హత్య.!

image

శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న మోహన్ అనే వ్యక్తి గత రాత్రి హత్యకు గురయ్యారు. హత్య చేసిన వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గతంలో మోహన్ తండ్రి ఇదే పార్టీ కార్యాలయంలో పనిచేసేవారు. అతని స్థానంలో మోహన్‌ను ఇటీవల నియమించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.