News November 19, 2025
లక్కీ డిప్కు ఎంతమంది సెలెక్ట్ అవుతారు?

తిరుమల శ్రీవారి విశేష సేవల కోసం ప్రతి నెలా దాదాపు 4-5 లక్షల మంది భక్తులు లక్కీ డిప్కు దరఖాస్తు చేసుకుంటారు. ఇందులో కేవలం 7,500 నుంచి 8,500 మందికి మాత్రమే సేవల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వీరు శ్రీవారిని తొలి గడప నుంచి అతి దగ్గరగా దర్శించుకునే అదృష్టాన్ని పొందుతారు. లక్కీ డిప్లో ఎంపిక కానివారు, శ్రీవాణి ట్రస్ట్కు ₹10 వేలు విరాళం ఇచ్చి కూడా మొదటి గడప దర్శనం ద్వారా శ్రీవారిని వీక్షించవచ్చు.
Similar News
News March 23, 2026
యుద్ధం.. స్టాక్ మార్కెట్లలో కల్లోలం

పశ్చిమాసియా సంక్షోభంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 601.8 పాయింట్ల నష్టంతో 22,512 వద్ద, సెన్సెక్స్ 1,836 పాయింట్లు కోల్పోయి 72,696 వద్ద క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్లో అత్యధికంగా టైటాన్ 6.99%, ట్రెంట్ 6.21%, అల్ట్రాటెక్ 5.40%, భారత్ ఎలక్ట్రానిక్స్ 4.94%, టాటా స్టీల్ 4.93% నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 93.95కి పడిపోయి రికార్డు కనిష్ఠాలను తాకింది.
News March 23, 2026
DANGER: ఈ పాస్వర్డ్స్ పెట్టుకుంటున్నారా?

హ్యాకర్లకు చిక్కకూడదంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవడం ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో కేంద్రం పలు సూచనలు చేసింది. ‘12-16 అక్షరాల పాస్వర్డ్లో A-Z, a-z, 0-9, స్పెషల్ క్యారెక్టర్స్ (@, #, $, &) ఉండేలా చూసుకోండి. మీ పేరు, పుట్టిన తేదీ లేదా ఫోన్ నంబర్లు వాడకండి. 123456 లేదా password వంటివి అస్సలు వద్దు. ప్రతి అకౌంట్కు వేర్వేరు పాస్వర్డ్స్ వాడుతూ కాలానుగుణంగా వాటిని మారుస్తూ ఉండండి’ అని సూచించింది.
News March 23, 2026
ఆర్థిక శాఖ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం

TG: ఆర్థిక శాఖ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోవడంతో 6 నెలల క్రితం ధిక్కరణ నోటీసులిచ్చింది. ఈరోజు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలివ్వగా రాలేదు. అసెంబ్లీ సమావేశాలున్నందున రాలేదని AG కోర్టుకు తెలిపారు. అయితే ముందే అనుమతి తీసుకోవాలి కదా? అని జడ్జి వ్యాఖ్యానించారు. వ్యక్తిగత హాజరును మినహాయించేది లేదని, రాత్రివరకు కోర్టులోనే ఉంటామని స్పష్టం చేశారు.


