News November 19, 2025

అయినవిల్లి లంక: కుమారుని మృతదేహాన్ని దానం చేసిన తల్లి

image

సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో కుమారుని శరీరాన్ని వైద్య విద్యార్థులకు తల్లి దానం చేసిన ఘటన అయినవిల్లిలంకలో జరిగింది. 80 ఏళ్ల చిట్టూరి సీతారత్నం కుమారుడు అచ్యుత రామన్న చౌదరి (గోపి)(45) మరణించాడు దీంతో తల్లి కిమ్స్ వైద్య కళాశాలకు మృతదేహాన్ని అప్పగించారు. కిమ్స్ అనాటమీ విభాగాధిపతి నారాయణరావు మృతుని తల్లికి మంగళవారం అవయవదాన పత్రం అందజేశారు.

Similar News

News March 28, 2026

పాలమూరు:ALERT.. ఏప్రిల్ వస్తోంది..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఏప్రిల్ మొదటి 2 వారాల్లోనే నగరంలో ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. మధ్యాహ్నం బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, రుమాలు తీసుకెళ్లాలని, నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, అవసరం లేకుండా ఎండలో తిరగకూడదని అధికారులు హెచ్చరించారు. వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News March 28, 2026

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా: వైసీపీ

image

మంత్రి మండిపల్లి వివాదంలో చిక్కుకున్నారు. నిన్న రాయచోటి కోదండరామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా చెప్పులు వేసుకొని స్వామివారికి పట్టు వస్త్రాలను ఇంటి నుంచి తీసుకెళ్లారు. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?, చంద్రబాబు చెప్పులతో పూజలు చేయగా లేనిది మంత్రి చెప్పులతో పట్టు వస్త్రాలు సమర్పిస్తే తప్పేమిటి అనుకున్నాడో ఏంటో’ అని వైసీపీ రీట్వీట్ చేసింది.

News March 28, 2026

విశాఖలో రక్తమోడుతున్న రహదారులు

image

విశాఖ రోడ్లు రక్తమోడుతున్నాయి. జిల్లాలో 2025లో 1,110 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 340 మంది మృతి చెందారు. లారీలు, ట్యాంకర్ల వల్ల 140 ప్రమాదాల్లో 80 మంది చనిపోగా 104 మంది గాయపడ్డారు. హిట్ అండ్ రన్ కేసులు 43 నమోదై, 25 మంది మృతిచెందగా 26 మందికి గాయాలయ్యాయి. ప్రమాదాలు 4% తగ్గినా మరణాలు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.