News November 19, 2025

అయినవిల్లి లంక: కుమారుని మృతదేహాన్ని దానం చేసిన తల్లి

image

సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో కుమారుని శరీరాన్ని వైద్య విద్యార్థులకు తల్లి దానం చేసిన ఘటన అయినవిల్లిలంకలో జరిగింది. 80 ఏళ్ల చిట్టూరి సీతారత్నం కుమారుడు అచ్యుత రామన్న చౌదరి (గోపి)(45) మరణించాడు దీంతో తల్లి కిమ్స్ వైద్య కళాశాలకు మృతదేహాన్ని అప్పగించారు. కిమ్స్ అనాటమీ విభాగాధిపతి నారాయణరావు మృతుని తల్లికి మంగళవారం అవయవదాన పత్రం అందజేశారు.

Similar News

News March 21, 2026

డియాగో గార్సియాపై ఇరాన్ దాడి.. ఖండించిన బ్రిటన్

image

ఇండియన్ ఓషన్‌లో ఉన్న US-UK మిలిటరీ బేస్‌ డియాగో గార్సియాపై <<19440362>>ఇరాన్ దాడిని<<>> బ్రిటన్ ఖండించింది. అలాగే గల్ఫ్ దేశాలపై దాడులను తప్పుపట్టింది. హార్ముజ్ జలసంధిని మూసేయడాన్ని తమకు, తమ మిత్ర దేశాలకు ముప్పుగా అభిప్రాయపడింది. ఈ యుద్ధంలో బ్రిటన్ నేరుగా పాల్గొనకపోయినా తమ స్థావరాలను వాడుకునేందుకు అమెరికాకు అనుమతించిన విషయం తెలిసిందే. అందుకే డియాగో గార్సియాను ఇరాన్ టార్గెట్ చేసింది.

News March 21, 2026

దాడులు ఆపండి.. ఇరాన్‌కు 22 దేశాల లేఖ

image

పశ్చిమాసియాలో 20 రోజులుగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్ముజ్ జలసంధిని వెంటనే ఓపెన్ చేయాలంటూ 22 దేశాలు ఇరాన్‌కు లేఖ రాశాయి. ఈ జాబితాలో UAE, UK, బహ్రెయిన్, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాలున్నాయి. గల్ఫ్ రీజియన్‌లోని ఆయిల్, గ్యాస్ క్షేత్రాలపై దాడులను ఆపాలని కోరాయి. ఇరాన్ చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోందన్నాయి.

News March 21, 2026

శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.7.19 కోట్లు

image

30 రోజులలో శ్రీశైల మల్లన్నకు భక్తులు సమర్పించిన కానుకలను శనివారం లెక్కించారు. రూ.7,19,58,064 నగదు రాబడిగా లభించింది. 122 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారు, 6 కేజీల 550 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ లభించాయి. పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు. కార్యక్రమంలో ఈవో ఎం.శ్రీనివాసరావు, పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు ఉన్నారు.