News November 19, 2025

గుంటూరు జిల్లా రైతుల ఖాతాల్లో ఎంత పడతాయంటే ?

image

అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బుధవారం నిధులు జమ చేయనుంది. గుంటూరు జిల్లాలో 1,06,329 మంది రైతుల ఖాతాల్లో రూ.70 కోట్లు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.53.16 కోట్లు, అదేవిధంగా పీఎం కిసాన్ కింద రూ.16.84 కోట్లు జమ అవుతాయని అధికారులు తెలిపారు. జిల్లా స్థాయి కార్యక్రమం లామ్ ఫామ్ ఆడిటోరియంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి జరగనుంది. మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొంటారు.

Similar News

News March 28, 2026

GNT: దరఖాస్తులు ఆహ్వానించిన కలెక్టర్

image

నైబర్ హుడ్ వర్క్ స్పేస్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నైబర్ హుడ్ వర్క్ స్పేస్ పాలసీ 2025-30లో భాగంగా జిల్లాలో పారిశ్రామికవేత్తలు, ఫ్రీలాన్సర్లు, మైక్రో ఎంటర్‌ ప్రైజర్స్‌కు సమీపంలో కార్యాలయ వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ పథకం క్రింద భవనాలను లీజుకు ఇవ్వదలచిన డెవలపర్లు https://investandhra.ap.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.

News March 28, 2026

GNT: నియామకపత్రాలు అందజేసిన కలెక్టర్

image

గ్రూప్-2 ద్వారా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన 10 మంది అభ్యర్థులకు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శనివారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ మండలాలకు నియామక పత్రాలు అందజేశారు. నియామక పత్రాలు అందుకున్న వారిలో హరికృష్ణ, ఎం. మహేశ్వరరావు, ఎన్. హర్షవర్ధన్ రెడ్డి, రామ సుబ్బా రెడ్డి, జి. ఉమాకాంత్, పి. రెడ్డి రాజా, టి. సుధాకర్, పి. వినయ్ కుమార్, వై. అనిల్ కుమార్, ఎస్. లక్ష్మీ నారాయణ ఉన్నారు.

News March 28, 2026

అమరావతిలో అత్యవసర సేవల లోపం బహిర్గతం

image

అమరావతిలో అత్యవసర సేవల లోపం బయటపడింది. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాల్లో రూ.19 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఉద్దండరాయునిపాలెంలో మధ్యాహ్నం జరిగిన ఘటనకు ఫైర్ ఇంజన్ 50 నిమిషాల తర్వాత చేరింది. మరో ఘటనలో కూడా స్పందన ఆలస్యం కనిపించింది. సమయానికి సహాయం అందక నష్టం పెరిగిందని విమర్శలు వస్తున్నాయి. రాజధాని అభివృద్ధి జరుగుతున్నా, భద్రతా సదుపాయాలు మెరుగుపర్చాలని ప్రజలు కోరుతున్నారు.