News November 19, 2025

గుంటూరు జిల్లా రైతుల ఖాతాల్లో ఎంత పడతాయంటే ?

image

అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బుధవారం నిధులు జమ చేయనుంది. గుంటూరు జిల్లాలో 1,06,329 మంది రైతుల ఖాతాల్లో రూ.70 కోట్లు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.53.16 కోట్లు, అదేవిధంగా పీఎం కిసాన్ కింద రూ.16.84 కోట్లు జమ అవుతాయని అధికారులు తెలిపారు. జిల్లా స్థాయి కార్యక్రమం లామ్ ఫామ్ ఆడిటోరియంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి జరగనుంది. మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొంటారు.

Similar News

News March 18, 2026

GNT: టెన్త్ విద్యార్థి ఆత్మహత్యపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

image

వట్టిచెరుకూరు బీసీ హాస్టల్‌కు చెందిన టెన్త్ విద్యార్థి రాకేశ్ ఆత్మహత్య ఘటనపై మంత్రి సవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థి కుటుంబానికి ఆమె సానుభూతి తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి, ఒత్తిడికి గురికాకుండా చూడాలని హాస్టల్ యాజమాన్యానికి సూచించారు. మార్కులే జీవితంలో ముఖ్యం కాదని చెప్పారు.

News March 18, 2026

GNT: సీఎం భద్రతా సిబ్బందికి పతకాలు

image

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని CM చంద్రబాబు వ్యక్తిగత భద్రతా విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలకు ఎంపిక చేసింది. CM ప్రత్యేక రక్షణ అధికారి మధుసూదన్‌కు ‘మహోన్నత సేవా పతకం’, కాన్వాయ్ డ్రైవర్ గిరిబాబుకు ‘ఉత్తమ సేవా పతకం’ ప్రకటించింది. 2019 నుంచి మధుసూదన్ CM వద్ద సేవలు అందిస్తుండగా, గిరిబాబు గత 15ఏళ్లుగా చంద్రబాబు కాన్వాయ్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

News March 17, 2026

GNT: స్వర్ణాంధ్ర@2047 క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం I&PR రూపొందించిన “స్వర్ణాంధ్ర@2047” క్యాలెండర్లను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం ఆవిష్కరించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం పేదరిక నిర్మూలన, ఉపాధి ఉద్యోగ కల్పన, నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి, వ్యవసాయంలో సాంకేతికత, ప్రపంచ స్థాయి రవాణా, స్వచ్ఛ ఆంధ్ర 10 సూత్రాలతో విజన్ డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందన్నారు.