News November 17, 2025
షేక్ హసీనాను దోషిగా తేల్చిన కోర్టు

బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాను ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్(ICT) దోషిగా తేల్చింది. గతేడాది విద్యార్థుల ఆందోళనలను హింసాత్మకంగా అణచివేశారని, 1400 మంది చావుకు కారణమయ్యారని ఆమెతో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిని విచారించిన ICT ఆధారాలను నిజమైనవిగా పరిగణించి దోషిగా తేల్చింది. ఆమెకు గరిష్ఠశిక్ష పడుతుందని పేర్కొంది. ఇవి తప్పుడు ఆరోపణలని, తీర్పును పట్టించుకోనని హసీనా అన్నారు.
Similar News
News November 17, 2025
ఐబొమ్మ క్లోజ్.. MovieRulz ఎప్పుడు?

సినిమాలను పైరసీ చేసి సినీ ఇండస్ట్రీకి తీవ్ర నష్టం కలిగిస్తున్న సైట్లను క్లోజ్ చేసే చర్యలు ముమ్మరం అయ్యాయి. ఇప్పటికే విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న ఐబొమ్మ సైట్ నిలిచిపోయింది. అలాగే రిలీజైన రోజే పైరసీ చేసే MovieRulz, Tamil Rockers వంటి ఇతరత్రా సైట్స్ పని పట్టి ఇండస్ట్రీకి న్యాయం చేయాలని పలువురు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. పైరసీ నెట్వర్క్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News November 17, 2025
ఐబొమ్మ క్లోజ్.. MovieRulz ఎప్పుడు?

సినిమాలను పైరసీ చేసి సినీ ఇండస్ట్రీకి తీవ్ర నష్టం కలిగిస్తున్న సైట్లను క్లోజ్ చేసే చర్యలు ముమ్మరం అయ్యాయి. ఇప్పటికే విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న ఐబొమ్మ సైట్ నిలిచిపోయింది. అలాగే రిలీజైన రోజే పైరసీ చేసే MovieRulz, Tamil Rockers వంటి ఇతరత్రా సైట్స్ పని పట్టి ఇండస్ట్రీకి న్యాయం చేయాలని పలువురు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. పైరసీ నెట్వర్క్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News November 17, 2025
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో 31 కృష్ణ జింకలు మృతి

కర్ణాటకలోని కిత్తూరు రాణి చెన్నమ్మ జూలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో 4 రోజుల్లో 31 కృష్ణ జింకలు మృతి చెందాయి. దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు ట్రీట్మెంటు అందించారని చెప్పారు. ఇతర జూలకు అది వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. బాక్టీరియా వ్యాప్తికి కారణం తెలుసుకొనేందుకు నిపుణుల బృందాన్ని పంపామన్నారు.


