News November 19, 2025
నిర్మల్: ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు

నిర్మల్ జిల్లాలోని 9, 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఎయిడెడ్ పాఠశాలల బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం డిసెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డి.శ్రీనివాస్ తెలిపారు. http://telangana epass.cgg. gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 27, 2026
GNT: కళల కాణాచి ముద్దుబిడ్డ గుత్తికొండ నరహరి

కళలకు పుట్టినిల్లు గుంటూరు జిల్లా.. కళల కాణాచి తెనాలి. ఈ గడ్డపై జన్మించిన గొప్ప మేధావి గుత్తికొండ నరహరి. ఆయన అమృతలూరు మండలం యలవర్రులో జన్మించారు. తెలుగు రాజకీయాల్లో అసమాన వక్తగా, రచయితగా, విశ్లేషకుడిగా చెరగని ముద్ర వేశారు. మూఢనమ్మకాలపై పోరాడి, ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం రేకెత్తించారు. గొప్ప నవ్య మానవవాదిగా పేరొందిన నరహరి వర్ధంతి నేడు (మార్చి 27). ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం.
News March 27, 2026
విశాఖ: రైల్వే ప్రయాణికులకు అలర్ట్

విశాఖపట్నం నుంచి శుక్రవారం బయలుదేరాల్సిన 20830 వందే భారత్ ఎక్స్ప్రెస్ రీషెడ్యూల్ అయింది. అనుసంధాన రైలు ఆలస్యంగా రావడంతో మధ్యాహ్నం 2:50 గంటలకు బదులుగా, సాయంత్రం 4:40 గంటలకు ఈ రైలు బయలుదేరుతుందని సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేస్తూ, ఈ మార్పును గమనించి ప్రయాణాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు.
News March 27, 2026
నైవేద్యంగా వడపప్పు, పానకం.. ఎందుకంటే?

శ్రీరామనవమి రోజున వడపప్పు, పానకం నైవేద్యంగా ఇవ్వడం వెనుక ఆరోగ్య, ఆధ్యాత్మిక విశిష్టతలు ఉన్నాయి. శ్రీరామనవమి వేసవి కాలంలో వస్తుండటంతో ఈ బెల్లంతో చేసిన పానకం ‘ఎనర్జీ డ్రింక్’లా పనిచేస్తుంది. నానబెట్టిన పెసరపప్పు (వడపప్పు) శరీరంలోని వేడిని తగ్గించి చలవ చేస్తుంది. రాముడికి ఇష్టమైన ఈ సాత్విక ఆహారాన్ని శ్రీరామనవమి నాడు సమర్పిస్తే ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చని భక్తుల నమ్మకం.


