News November 19, 2025
PDPL: డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే చెప్పండి: కలెక్టర్

PDPL జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాల నిరోధంపై ఆయన నిన్న ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ యువత జీవితాలను నాశనం చేస్తాయని, దీనిపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 25, 2026
రెండుగా విడిపోనున్న ‘కరీంనగర్’..?

అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలను పెంచుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కరీంనగర్ నియోజకవర్గం 2 నియోజకవర్గాలయ్యే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం KNR, KNR రూరల్, కొత్తపల్లి మండలాలతో ఒక నియోజకవర్గంగా ఉంది. KNR మండలాన్ని ఒక నియోజకవర్గంగా, కొత్తపల్లి, KNR రూరల్ మండలం కలిపి మరో నియోజకవర్గమయ్యే అవకాశాలు ఉన్నాయని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.
News March 25, 2026
నేడు గుంటూరుకు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు గుంటూరుకు వెళ్లనున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూతురు వివాహానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం. వేడుక అనంతరం రేవంత్ హైదరాబాద్ చేరుకొని అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
News March 25, 2026
వంటగ్యాస్ బుకింగ్.. కొత్త రూల్

సిలిండర్ల కొరత నేపథ్యంలో బుకింగ్ రూల్స్ను ఆయిల్ కంపెనీలు మరింత కఠినతరం చేశాయి. డబుల్ సిలిండర్ ఉన్నవారు 35 రోజుల తర్వాతే రీఫిల్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నాయి. ఇక ఉజ్వల కనెక్షన్ ఉన్నవారికి ఈ గడువు 45 రోజులు కాగా సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల తర్వాత బుక్ చేయాలి. అంతకంటే ముందుగా చేసే బుకింగ్స్ను సిస్టమ్ ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తుంది.


