News April 13, 2024

నెల్లూరు: 15వ తేదీతో ముగియనున్న గడువు

image

15వ తేదీ రాత్రితో ఓట్ల నమోదుకు గడువు ముగియనుంది. 18 ఏళ్లు నిండి ఇంకా ఓటు నమోదు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యంత్రాంగం సూచిస్తోంది. ఇటీవల విడుదలైన జాబితాలో జిల్లాలో 18 నుంచి 19 వయసు ఓటర్లు 36,175 మంది ఉండగా… 40-49 ఏళ్ల వారు అత్యధికంగా 4,29,668 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News April 2, 2026

9 కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కేంద్రానికి ప్రతిపాదన

image

AP: ₹915CRతో 9 పర్యాటక ప్రాజెక్టుల కోసం మంత్రి దుర్గేష్ కేంద్ర మంత్రి షెకావత్‌కి ప్రతిపాదనలు అందించారు. మచిలీపట్నం బీచ్ అభివృద్ధికి ₹120.04CR ఇవ్వాలన్నారు. ₹95.18CRతో మంగళగిరి, ₹213.72CRతో అరసవల్లి, ₹48.95CRతో నెల్లూరు గృహ మల్లేశ్వర స్వామి,₹36CRతో కోరుకొండ నరసింహస్వామి, ₹120CRతో వాడపల్లి ఆలయాల అభివృద్ధికి ప్రతిపాదించారు. లేపాక్షిలో, లంబసింగి, బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి ₹280.24CR ఇవ్వాలని కోరారు.

News April 2, 2026

నెల్లూరు: 14 మంది మృతికి కారకులైన ఇద్దరు అరెస్ట్

image

మార్కాపురం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని DSP నాగరాజు తెలిపారు. రిపేర్లు వస్తున్నా బస్సు కండీషన్ తెలిసి కూడా బస్సు నడిపిన క్లీనర్ యువరాజ్‌ను, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన బస్సు యజమాని హరికృష్ణను అరెస్టు చేశారు. జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లాలోని కలిగిరికి వెళుతున్న బస్సు టిప్పర్‌ను ఢీకొన్న ఘటనలో 14 మంది మృతి చెందారు. క్లీనర్‌కి లైసెన్స్ కూడా లేదని అన్నారు.

News April 2, 2026

నెల్లూరు: కూతురి అసభ్యకర ఫొటోలు, వీడియోలు తండ్రికి పంపి..

image

ప్రకాశం(D), జరుగుమల్లి(M) గంగరాజుపాలేనికి చెందిన అశోక్ కుమార్ మూడేళ్ల క్రితం నెల్లూరుకు బేల్దారి పనుల కోసం వచ్చాడు. ఈక్రమంలో ఓ బాలికకు మాయమాటలు చెప్పి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు తీశాడు. అశోక్ కుమార్ ఆ బాలిక తండ్రికి రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండడంతో ఆయన నిలదీశాడు. దీంతో బాలిక ఫొటోలు, వీడియోలు తండ్రికి పంపాడు. కేసు రుజువు కావడంతో నిందితుడికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.9 వేల ఫైన్ విధించింది.