News November 19, 2025

మహబూబ్‌నగర్: ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు

image

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్సీ విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. 5 నుంచి 10వ తరగతి చదువుతున్న వారికి సంవత్సరానికి రూ.1,000 నుంచి రూ.3,500 వరకు అందజేస్తారు. అర్హులైన విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్‌ కార్డుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News March 19, 2026

రాయితీ పథకాలను అందిపుచ్చుకోవాలి: కలెక్టర్

image

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2025-26 సంవత్సరానికి మంజూరైన రాయితీ పథకాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. ఈవీ వాహనాలు, వ్యవసాయ పరికరాలపై 60 నుంచి 90 శాతం వరకు రాయితీ ఉంటుందని తెలిపారు. అర్హులు ఈ నెల 24లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికలో మహిళలు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం సంబంధిత పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

News March 19, 2026

జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: కలెక్టర్

image

సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన తెలుగు సంవత్సరం ప్రతి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఉగాది కొత్త ఆశలు, లక్ష్యాలకు శ్రీకారమని పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ, ప్లాస్టిక్ రహితంగా, పరిశుభ్రమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సూచించారు.

News March 19, 2026

బాపట్ల జిల్లాలో 7,338 LPG సిలిండర్లున్నాయి

image

జిల్లాలో LPG కొరత లేదని బాపట్ల DSO జమీర్ బాషా తెలిపారు. ప్రస్తుతం 7,338 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. జిల్లాలో 27 గ్యాస్ ఏజెన్సీలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల తర్వాతే బుకింగ్ చేయాలని చెప్పారు. అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయరాదని అన్నారు.