News November 17, 2025
జగిత్యాల: EVMల గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

ధరూర్ క్యాంప్లో ఉన్న ఈవీఎంల గోదామును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.సత్యప్రసాద్ సోమవారం తనిఖీ చేశారు. యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతిక వ్యవస్థలను ఈ సందర్భంగా ఆయన సమగ్రంగా పరిశీలించారు. గోదాములో ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం పర్యవేక్షణ కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్డీవో మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 17, 2025
ఐబొమ్మ క్లోజ్.. MovieRulz ఎప్పుడు?

సినిమాలను పైరసీ చేసి సినీ ఇండస్ట్రీకి తీవ్ర నష్టం కలిగిస్తున్న సైట్లను క్లోజ్ చేసే చర్యలు ముమ్మరం అయ్యాయి. ఇప్పటికే విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న ఐబొమ్మ సైట్ నిలిచిపోయింది. అలాగే రిలీజైన రోజే పైరసీ చేసే MovieRulz, Tamil Rockers వంటి ఇతరత్రా సైట్స్ పని పట్టి ఇండస్ట్రీకి న్యాయం చేయాలని పలువురు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. పైరసీ నెట్వర్క్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News November 17, 2025
ఐబొమ్మ క్లోజ్.. MovieRulz ఎప్పుడు?

సినిమాలను పైరసీ చేసి సినీ ఇండస్ట్రీకి తీవ్ర నష్టం కలిగిస్తున్న సైట్లను క్లోజ్ చేసే చర్యలు ముమ్మరం అయ్యాయి. ఇప్పటికే విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న ఐబొమ్మ సైట్ నిలిచిపోయింది. అలాగే రిలీజైన రోజే పైరసీ చేసే MovieRulz, Tamil Rockers వంటి ఇతరత్రా సైట్స్ పని పట్టి ఇండస్ట్రీకి న్యాయం చేయాలని పలువురు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. పైరసీ నెట్వర్క్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News November 17, 2025
అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: ఎస్పీ

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) అర్జీలను వెంటనే పరిష్కరించాలని కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఆయన 58 మంది ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులకు వెంటనే పంపి, సకాలంలో పరిష్కారం చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


