News November 19, 2025

పెద్దారవీడు వద్ద ఎద్దుల అరకలను ఢీకొని దోర్నాల వ్యక్తి మృతి

image

పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న ఎద్దుల అరకలను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. వారిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు దోర్నాల మండలం యడవల్లికి చెందిన నల్లబోతుల శివగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 2, 2026

దాడులు సమంజసం కాదు: బూచేపల్లి

image

మాజీ మంత్రి అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పినప్పటికీ, ఆయన ఇంటిపై దాడి చేయడం ఎంత వరకు సమంజసమని జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కార్యకర్తలను అదుపు చేయాల్సిన బాధ్యతను టీడీపీ గుర్తించాలన్నారు.

News February 2, 2026

ప్రకాశం జిల్లా అవతరణం జరిగింది నేడే..!

image

ప్రకాశం జిల్లా నేడు అవతరించిన రోజు. గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొంత భాగాన్ని వేరుచేసి 1970 ఫిబ్రవరి 2వ తేదీన ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అనంతరం 1972లో జిల్లా వాసి, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీదుగా జిల్లాకు ప్రకాశమని నామకరణం చేశారు. అయితే ప్రస్తుతం ప్రకాశం నుంచి విడిపోయిన మార్కాపురం డివిజన్ జిల్లాగా అవతరించింది.

News February 2, 2026

ప్రకాశం జిల్లా అవతరణం జరిగింది నేడే..!

image

ప్రకాశం జిల్లా నేడు అవతరించిన రోజు. గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొంత భాగాన్ని వేరుచేసి 1970 ఫిబ్రవరి 2వ తేదీన ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అనంతరం 1972లో జిల్లా వాసి, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీదుగా జిల్లాకు ప్రకాశమని నామకరణం చేశారు. అయితే ప్రస్తుతం ప్రకాశం నుంచి విడిపోయిన మార్కాపురం డివిజన్ జిల్లాగా అవతరించింది.