News November 19, 2025
2027 ఆగస్టులో బుల్లెట్ రైలు పరుగులు

దేశంలో 2027 ఆగస్టులో తొలి బుల్లెట్ రైలు ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తొలి దశలో గుజరాత్లోని సూరత్, వాపి మధ్య 100 కి.మీ. మేర నడపనున్నట్లు చెప్పారు. మొత్తం ప్రాజెక్టు 2029లో పూర్తవుతుందని అన్నారు. ముంబై-అహ్మదాబాద్ కారిడార్ అందుబాటులోకి వస్తే 2 గంటల్లోనే జర్నీ పూర్తి అవుతుందని అన్నారు. ఇటీవల ప్రధాని <<18307759>>పర్యటన <<>>తర్వాత అశ్వినీ వైష్ణవ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Similar News
News March 27, 2026
వరుణ్ ధవన్ కూతురికి ఆరోగ్య సమస్య.. నడవలేక..

తన కూతురు లారాకు DDH (డెవలప్మెంటల్ డిస్ప్లేసియా ఆఫ్ ది హిప్) అనే ఆరోగ్య సమస్య వచ్చిందని బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ తెలిపారు. ‘దీని వల్ల ఒక కాలు పొట్టిగా అవుతుంది. సరిగ్గా నడవలేకపోయింది. డాక్టర్లు సర్జరీ అవసరం లేకుండానే వైద్య ప్రక్రియతో తుంటిని యథాస్థానానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం కోలుకుంటోంది. దీనిపై నేనొక పుస్తకం రాయాలనుకుంటున్నా’ అని వివరించారు. 2024లో వరుణ్, నటాషాకు లారా జన్మించింది.
News March 27, 2026
DDH అంటే ఏంటి?

<<19493931>>DDH<<>> (డెవలప్మెంటల్ డిస్ప్లేసియా ఆఫ్ ది హిప్) అనేది చిన్న పిల్లల్లో తుంటి జాయింట్ సరిగ్గా ఏర్పడకపోవడం లేదా కదలడం వల్ల వచ్చే సమస్య. పుట్టుకతో వచ్చే హిప్ డిస్లొకేషన్ అని కూడా అంటారు. తుంటి ఎముకలోని సాకెట్లో తొడ ఎముక పైభాగం సరిగ్గా సెట్ కాకుండా పక్కకు లేదా బయటకు వస్తుంటుంది. దీని వల్ల నడకలో ఇబ్బందులు వస్తాయి. ఆర్థరైటిస్కు దారితీయొచ్చు. ముందే గుర్తించడం ద్వారా చికిత్స, సర్జరీతో నయం చేయొచ్చు.
News March 27, 2026
ఒట్రోవర్ట్స్ గురించి తెలుసా?

మనుషుల్లో ఇన్ట్రోవర్ట్స్, ఎక్స్ట్రోవర్ట్సే కాకుండా ఒట్రోవర్ట్స్ కూడా ఉంటారని US సైకియాట్రిస్ట్ రమీ కమిన్స్కీ చెబుతున్నారు. ‘అందరితో కలిసిపోయినట్లు కనిపిస్తారు. గ్రూపుల్లో యాక్టివ్గా, మిగతావారితో కలివిడిగా ఉంటారు. కానీ లోపల మాత్రం వారి అనుభవం వేరుగా ఉంటుంది. తమ నిజమైన స్వభావానికి ప్రాధాన్యం ఇస్తారు. భావోద్వేగాల పరంగా స్వతంత్రంగా ఉంటారు’ అని కమిన్స్కీ వివరించారు. మరి మీరూ ఒట్రోవర్టా?


