News November 17, 2025
భవాని దీక్షల విరమణకు ప్రత్యేక ఏర్పాట్లు: ఈవో

భవాని దీక్షల విరమణ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై ఆలయ అధికారులు, సిబ్బందితో సమావేశం జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనా నాయక్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబర్ 4న జరిగే కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీక్షా విరమణ సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఈవో సిబ్బందిని ఆదేశించారు.
Similar News
News November 17, 2025
TG అప్డేట్స్

* డిసెంబర్ 14న కొమురవెల్లి మల్లన్న కళ్యాణం. జనవరి 18-మార్చి 16 వరకు జాతర. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: మంత్రి సురేఖ
* ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం మేము తీసుకోవాలా? అంటూ స్పీకర్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
* TTDకి రూ.4.5 కోట్ల విలువైన బంగారు యజ్ఞోపవేతం(జంధ్యం) అందజేసిన నీలోఫర్ కేఫ్ ఓనర్ బాబురావు
* డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు లోగోను ఖరారు చేసిన క్యాబినెట్
News November 17, 2025
TG అప్డేట్స్

* డిసెంబర్ 14న కొమురవెల్లి మల్లన్న కళ్యాణం. జనవరి 18-మార్చి 16 వరకు జాతర. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: మంత్రి సురేఖ
* ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం మేము తీసుకోవాలా? అంటూ స్పీకర్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
* TTDకి రూ.4.5 కోట్ల విలువైన బంగారు యజ్ఞోపవేతం(జంధ్యం) అందజేసిన నీలోఫర్ కేఫ్ ఓనర్ బాబురావు
* డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు లోగోను ఖరారు చేసిన క్యాబినెట్
News November 17, 2025
కొమ్మమూరులో డెడ్ బాడీ కలకలం

కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం సమీపంలోని కొమ్మమురు కాలువ వంతెన వద్ద సోమవారం డెడ్ బాడీ కలకలం రేపింది. మృతురాలికి 50 ఏళ్లు ఉంటాయని, ఆమె ఎత్తు 4.5 అడుగులు, ఎరుపు రంగు దుస్తులను ధరించినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు కారంచేడు ఎస్హెచ్ఓను సంప్రదించాలన్నారు.


