News November 19, 2025
అయినవిల్లి లంక: కుమారుని మృతదేహాన్ని దానం చేసిన తల్లి

సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో కుమారుని శరీరాన్ని వైద్య విద్యార్థులకు తల్లి దానం చేసిన ఘటన అయినవిల్లిలంకలో జరిగింది. 80 ఏళ్ల చిట్టూరి సీతారత్నం కుమారుడు అచ్యుత రామన్న చౌదరి (గోపి)(45) మరణించాడు దీంతో తల్లి కిమ్స్ వైద్య కళాశాలకు మృతదేహాన్ని అప్పగించారు. కిమ్స్ అనాటమీ విభాగాధిపతి నారాయణరావు మృతుని తల్లికి మంగళవారం అవయవదాన పత్రం అందజేశారు.
Similar News
News March 14, 2026
సిలిండర్ల బుకింగ్ మాటున సైబర్ కేటుగాళ్లు

TG: గ్యాస్ బుకింగ్ పేరిట సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ‘వారు పంపే APK ఫైళ్లను ఓపెన్ చేయొద్దు. సిలిండర్ తక్షణ డెలివరీ, ముందస్తు చెల్లింపులు అంటూ వచ్చే కాల్స్ను నమ్మొద్దు. బుకింగ్కు అధికారిక వెబ్సైట్లను వినియోగించాలి. లేదా ఏజెన్సీ వద్దకు వెళ్లాలి. మోసానికి గురైతే 1930కి కాల్ చేయాలి. http://cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయాలి’ అని సూచించారు.
News March 14, 2026
కొండగట్టు అగ్నిప్రమాద బాధితులకు విరాళాల ద్వారా ఆర్థిక సాయం

కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు విరాళాలు సేకరించిన స్థానికులు ఇవాళ వారికి అందజేశారు. గత సంవత్సరం నవంబర్ 29న కొండగట్టు దిగువన సంభవించిన అగ్నిప్రమాదానికి దాదాపు 23 బొమ్మల దుకాణాలు దగ్ధమయ్యాయి. భాదితులకు సహాయం చేయడానికి స్థానిక యువత, ప్రజలు తమ వంతు సహాయంగా “Helping Hands for Kondagattu Fire Accident” అనే గ్రూప్ తయారు చేసి, విరాళాలు సేకరించారు. సేకరించిన రూ.5,73,000 బాధితులకు అందజేశారు.
News March 14, 2026
నిర్భయ నిధి కింద రాష్ట్రంలోని ములుగు జిల్లా ఎంపిక

నిర్భయ నిధి కింద “మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు” పథకానికి ములుగు జిల్లా ఎంపికైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పాల్నా పథకం కింద పనిచేస్తున్న క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల వేతనాలను పెంచాలని కేంద్రాన్ని కోరారు. ప్రాజెక్ట్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీతక్క పేర్కొన్నారు.


