News November 17, 2025
భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించండి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చిన వినతుల పరిష్కారంలో వివిధ శాఖల అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా స్పష్టం చేశారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి 140 అర్జీలు స్వీకరించారు. వీటిలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, రెవెన్యూ అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News November 17, 2025
ప్రియ జనులారా.. ఉచితమంటే ఎగబడకండి!

చాలా మందికి ఉచితం అనే సరికి ఎగబడటం పరిపాటైంది. దీనిమాటున ప్రమాదం పొంచి ఉన్నా గుర్తించట్లేదు. తాజాగా <<18309732>>iBOMMA<<>> విషయంలోనూ ఇదే రుజువైంది. ఉచితంగా సినిమా చూసే క్రమంలో తమకు తెలియకుండానే సమాచారాన్ని వారికి చేరవేశారు. ఈ క్రమంలో 50లక్షల మంది డేటా వారి చేతికి చిక్కిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఫ్రీగా వస్తుందనే సరికి ఆన్లైన్లో ముందూ వెనకా చూడకుండా వ్యవహరిస్తే ప్రమాదమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News November 17, 2025
ప్రియ జనులారా.. ఉచితమంటే ఎగబడకండి!

చాలా మందికి ఉచితం అనే సరికి ఎగబడటం పరిపాటైంది. దీనిమాటున ప్రమాదం పొంచి ఉన్నా గుర్తించట్లేదు. తాజాగా <<18309732>>iBOMMA<<>> విషయంలోనూ ఇదే రుజువైంది. ఉచితంగా సినిమా చూసే క్రమంలో తమకు తెలియకుండానే సమాచారాన్ని వారికి చేరవేశారు. ఈ క్రమంలో 50లక్షల మంది డేటా వారి చేతికి చిక్కిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఫ్రీగా వస్తుందనే సరికి ఆన్లైన్లో ముందూ వెనకా చూడకుండా వ్యవహరిస్తే ప్రమాదమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News November 17, 2025
పోక్సో కేసులో వ్యక్తికి జీవిత ఖైదు

పోక్సో కేసులో వ్యక్తికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. సరిత మంగళవారం తీర్పు చెప్పారు. చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన సయ్యద్ లాలూ అత్యాచారం చేశారు. కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. 14 మంది సాక్షులను విచారించగా నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.


