News November 19, 2025

KNR: వచ్చే నెలలోనే స్థానిక సమరం.. పల్లెల్లో సందడి వాతావరణం..!

image

బీసీ రిజర్వేషన్లపై ప్రతిష్ఠంభన సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీతో వీడింది. దీంతో పల్లెల్లో స్థానిక సమరం షురూ కానుంది. డిసెంబర్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం తాజాగా పచ్చజెండా ఊపింది. కేవలం పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించడానికి నిర్ణయించింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1,216 గ్రామపంచాయతీలు ఉండగా, 60 ZPTC, 646 MPTC స్థానాలు ఉన్నాయి. SHARE IT.

Similar News

News March 14, 2026

విశాఖలో మరో IT పార్క్.. 30వేల జాబ్స్!

image

AP: విశాఖ మధురవాడ(రుషికొండ) ఐటీ హిల్స్‌లో గ్రేడ్-1 ఐటీ పార్క్ రానుంది. విశాఖ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు హిల్-3 వెనుక ప్రభుత్వం 30 ఎకరాలు కేటాయించింది. ఈ కంపెనీ 3 దశల్లో రూ.2,200కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా, దాదాపు 30,000 మందికి ఉద్యోగావకాశాలు రానున్నట్లు సమాచారం. 30లక్షల చ.అ విస్తీర్ణంలో భవనాలు నిర్మించనున్నారు. ఇక అమరావతిలో రూ.300కోట్ల పెట్టుబడితో ‘జేవియర్’ క్యాంపస్ ఏర్పాటు కానుంది.

News March 14, 2026

ప.గో: మహిళపై లైంగిక వేధింపులు.. మూడేళ్ల జైలు

image

జంగారెడ్డిగూడెం మండలంలోని ఓ జీడిపప్పు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు ఉండ్రాజవరపు శివకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. గతేడాది జులైలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆర్పీవీఎస్ మురళీకృష్ణ.. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్షతో పాటు రూ. 6 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో నెల జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు.

News March 14, 2026

కామారెడ్డి: ఆర్టీసీ బస్సుల్లో పది విద్యార్థులకు బంపర్ ఆఫర్!

image

కామారెడ్డి జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఆర్టీసీ విద్యార్థులకు భారీ ఊరటనిచ్చింది. విద్యార్థులు చేయి ఎత్తిన చోట బస్సులు ఆపాలని, వారిని పరీక్షా కేంద్రాల వద్ద దించాలని డ్రైవర్లు, కండక్టర్లను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షల సమయంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.