News November 19, 2025
భారత్ను ప్రేమించే వాళ్లందరూ హిందువులే: మోహన్ భాగవత్

భారత్ను ప్రేమించే వారందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిందూ దేశంగా ఇండియా ఉండటానికి అధికారిక డిక్లరేషన్ అవసరం లేదని, మన నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు దాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు. అస్సాంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ‘హిందూ అనేది కేవలం మతపరమైన పదం కాదు. వేల ఏళ్ల నాగరికత గుర్తింపు. భారత్, హిందూ రెండూ పర్యాయపదాలు’ అని తెలిపారు.
Similar News
News March 5, 2026
421 పోస్టులు.. దరఖాస్తుకు 3 రోజులే అవకాశం

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో 421 పోస్టులకు అప్లై చేయడానికి 3రోజులే(మార్చి 8) అవకాశం ఉంది. పోస్టును బట్టి డిగ్రీ, MBA/PGDM, CA/CFA/CMA అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ స్క్రూట్నీ, ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bankofbaroda.bank.in/
News March 5, 2026
రాష్ట్రానికి భారీ వర్షసూచన!

TG: రాష్ట్రంలో ఈ నెల 18/19 తర్వాత మరోసారి అన్సీజనల్ రెయిన్స్కు ఆస్కారముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత నెల 23-24 తేదీల్లో కురిసిన వర్షాల కంటే భారీగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే అప్పటి వరకూ ఎండలు తీవ్రంగా ఉంటాయని, 40+°C టెంపరేచర్ నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. హైదరాబాద్లో 36-37°C మధ్య ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేశారు.
News March 5, 2026
ట్రంప్కు షాక్.. వసూలు చేసిన టారిఫ్స్ రిఫండ్!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు US ట్రేడ్ కోర్ట్ షాకిచ్చింది. కంపెనీల నుంచి వసూలు చేసిన అదనపు టారిఫ్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఎమర్జెన్సీ పవర్ లా కింద టారిఫ్స్ చెల్లించిన అన్ని కంపెనీలకు ఇది వర్తిస్తుందని, రిఫండ్కు వారు అర్హులని స్పష్టం చేసింది. ఈ మొత్తం $175B ఉంటుందని అంచనా. కాగా అంతకుముందు ట్రంప్ టారిఫ్స్ను US సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.


