News November 19, 2025
అయినవిల్లి లంక: కుమారుని మృతదేహాన్ని దానం చేసిన తల్లి

సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో కుమారుని శరీరాన్ని వైద్య విద్యార్థులకు తల్లి దానం చేసిన ఘటన అయినవిల్లిలంకలో జరిగింది. 80 ఏళ్ల చిట్టూరి సీతారత్నం కుమారుడు అచ్యుత రామన్న చౌదరి (గోపి)(45) మరణించాడు దీంతో తల్లి కిమ్స్ వైద్య కళాశాలకు మృతదేహాన్ని అప్పగించారు. కిమ్స్ అనాటమీ విభాగాధిపతి నారాయణరావు మృతుని తల్లికి మంగళవారం అవయవదాన పత్రం అందజేశారు.
Similar News
News April 2, 2026
చరణ్ అన్న సలహా కచ్చితంగా పాటిస్తా: నిహారిక

నిర్మాతగా నిలదొక్కుకోవాలంటే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని రామ్చరణ్ తనకు సలహా ఇచ్చారని మెగాడాటర్ నిహారిక చెప్పుకొచ్చారు. చరణ్ అన్న చెప్పిన ‘నెవర్ సే నెవర్’ రూల్ కచ్చితంగా పాటిస్తానని అన్నారు. ఇక అన్నయ్య వరుణ్ తేజ్ హీరోగా తాను నిర్మించనున్న <<19495867>>’బరి’<<>> సినిమా బడ్జెట్ ₹60కోట్లు అని వెల్లడించారు. దీంతో నిర్మాతగా నిహారిక కెరీర్లో ‘బరి’ హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవనుంది.
News April 2, 2026
మెదక్: ‘మీ సేవ’ ఛార్జీల పెంపు: అదనపు కలెక్టర్

‘మీ సేవ’ కేంద్రాల ఛార్జీలు పెంచినట్లు మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. కనీస ఛార్జీ రూ.35 నుంచి రూ.62కి పెరిగిందని, A కేటగిరీకి రూ.62, B కేటగిరీ సేవలకు రూ.80గా నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై మీసేవ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. నిర్ణయించిన ధరలకు మించి వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 3వ తేదీన మెయింటెనెన్స్ డే కారణంగా కేంద్రాలు పనిచేయవన్నారు.
News April 2, 2026
KMR: మద్యం తాగి వాహనం నడిపిన 50 మందికి శిక్ష: ఎస్పీ

కామారెడ్డి జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 50 మందికి న్యాయస్థానం శిక్షలు విధించినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. వారిలో ఆరుగురికి రెండు రోజుల జైలు శిక్ష, అందరికీ కలిపి రూ.57,500 జరిమానా విధించారు. ప్రమాదాలు విధి కాదు, మన నిర్లక్ష్యమేనని ఎస్పీ పేర్కొన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి కుటుంబాలను రోడ్డున పడేయవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.


