News November 19, 2025

చిత్తూరు రైతులకు నేడు రూ.136.46 కోట్ల జమ

image

చిత్తూరు జిల్లాలోని రైతులకు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.05 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.102.88 కోట్లు విడుదల చేయనుంది. పీఎం కిసాన్ పథకం కింద 1.67లక్షల మంది రైతులకు రూ.33.58 కోట్లను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. మొత్తంగా జిల్లా రైతుల ఖాతాల్లో బుధవారం రూ.136.46 కోట్ల జమవుతుంది.

Similar News

News March 28, 2026

పులిచెర్ల: ఫలితాలిస్తోన్న సోలార్ కంచె

image

ఏనుగుల దాడులు అరికట్టేందుకు పులిచెర్ల మండలంలోని అటవీ సరిహద్దులో ఏర్పాటుచేసిన కోలార్ కంచ సత్ఫలితాలను ఇస్తున్నట్టు అటవీ అధికారులు తెలిపారు. గత నెలలో ఐదు కిలోమీటర్ల పొడవుతో ప్రభుత్వం సోలార్ కంచ ఏర్పాటు చేసింది. మూడు రోజుల క్రితం భీమవరం అటవీ ప్రాంతం నుంచి కల్లూరు సమీపంలోని అడవి వద్దకు ఏనుగుల గుంపు చేరుకున్నాయి. సోలార్ కంచ దాటేందుకు ప్రయత్నించగా షాక్ కొట్టడంతో అక్కడి నుంచి అవి వెనుతిరిగాయి.

News March 28, 2026

చిత్తూరు: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే చర్యలు

image

జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ శనివారం హెచ్చరించారు. ఐపీఎల్ ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇందుకోసం పట్టిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎక్కడైనా బెట్టింగ్లకు పాల్పడితే 112, 9440900005 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

News March 28, 2026

చిత్తూరు: పంచాయితీ అక్రమాలపై ఫిర్యాదులకు సిద్దం.?

image

చిత్తూరు జిల్లాలోని 811 పంచాయితీలలో ఏప్రిల్ 3 నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది. దీంతో కూటమి నేతలు గత ఐదేళ్ల కాలంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. వాటిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు. ఇది పార్టీల మధ్య కొత్త సమస్యకు దారి తీయనుందనే ప్రచారం కూడా జరుగుతోంది.