News November 17, 2025

సమస్యలుంటే నేరుగా ఫిర్యాదు చేయండి: సంగారెడ్డి ఎస్పీ

image

ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలు నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ ఎస్.ఐ.లను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 17, 2025

పొగమంచులో నెమ్మదిగా వెళ్లండి: సీపీ

image

శీతాకాలంలో చలి, పొగమంచు తీవ్రత పెరిగినందున వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, వాహనదారులు లైటింగ్ కండిషన్ చూసుకోవాలని, తక్కువ వేగంతో ఒకే లైన్‌లో ప్రయాణించాలని, ఓవర్ టేక్ చేయవద్దని ఆయన సూచించారు. సురక్షిత ప్రయాణం కోసం జాగ్రత్తలు పాటించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

News November 17, 2025

పొగమంచులో నెమ్మదిగా వెళ్లండి: సీపీ

image

శీతాకాలంలో చలి, పొగమంచు తీవ్రత పెరిగినందున వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, వాహనదారులు లైటింగ్ కండిషన్ చూసుకోవాలని, తక్కువ వేగంతో ఒకే లైన్‌లో ప్రయాణించాలని, ఓవర్ టేక్ చేయవద్దని ఆయన సూచించారు. సురక్షిత ప్రయాణం కోసం జాగ్రత్తలు పాటించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

News November 17, 2025

కృష్ణా: SP కార్యాలయంలో ‘మీకోసం’.. 37 అర్జీలు దాఖలు

image

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో మొత్తం 37 అర్జీలు అందినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. వాటిని కూలంకషంగా పరిశీలించి, సత్వరం పరిష్కరించేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు బదిలీ చేసినట్లు, తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.