News April 13, 2024
హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంగా ‘పైగా ప్యాలెస్’

చారిత్రాత్మక వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన బేగంపేట పైగా ప్యాలెస్ను హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంగా మార్చే ప్రక్రియ మొదలైంది. హెచ్ఎండీఏ కార్యకలాపాలన్నీ ఒకే చోట నుంచి జరిగేలా చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోను జారీ చేసింది. ప్రస్తుతం హెచ్ఎండీఏకు సంబంధించిన కార్యకలాపాలు అమీర్పేట, నానక్రాంగూడ, హుస్సేన్సాగర్, లుంబినీ పార్కు ప్రాంతాల నుంచి జరుగుతున్నాయి.
Similar News
News September 11, 2025
జూబ్లీహిల్స్: ఆశల పల్లకిలో ‘హస్తం’ అభ్యర్థులు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీల నుంచి ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. BRS నుంచి మాగంటి సునీతకే టికెట్ ఇస్తారని తెలుస్తోంది. BJP నుంచి లంకల దీపక్ రెడ్డి, ఇతరుల పేర్లను పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. జూబ్లీహిల్స్లో గెలిస్తే మంత్రి పదవి ఖాయం అంటూ కొందరు అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తూ ఆశల పల్లకిలో విహరించడం గమనార్హం.
News September 11, 2025
HYD: మీరు వినరు.. వారు వదలరు

గణేశ్ ఉత్సవాల్లో హైదరాబాద్ షీ టీమ్స్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. 1,612 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొంది. పట్టుబడ్డ వారిలో 1,544 మంది పెద్దలు, 68 మంది ఉన్నారు. ఇందులో 168 పెట్టి కేసులు నమోదు చేయగా.. 70 కేసులకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కొందరికి జరిమానా, ఒకరికి 2 రోజుల సింపుల్ జైలు శిక్ష, 1,444 మందికి వార్నింగ్, కౌన్సెలింగ్ కోసం పిలిచి అవగాహన కల్పించారు.
News September 11, 2025
HYD: నకిలీ వెబ్సైట్లను గుర్తించడంపై ముందడుగు..!

HYDలో CipherCop-2025 ప్రారంభమైందని బుధవారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికాగోయల్ తెలిపారు. ఇది మొదటి జాతీయ హ్యాకథాన్ అన్నారు. వచ్చే 2 రోజుల్లో యువ మేధావులు పోలీస్ టెక్నాలజీ మిషన్ ప్రేరణతో క్రిప్టో లావాదేవీలు గుర్తించడం, నకిలీ వెబ్సైట్లు, స్కామ్ యాప్లు, మోసపూరిత డిజిటల్ కంటెంట్ను వెలికితీయడంపై సవాళ్లు స్వీకరిస్తారని చెప్పారు.