News November 17, 2025
స్వర్ణ పంచాయతీల్లో 100% పన్ను వసూలు చేయాలి: కలెక్టర్

స్వర్ణ పంచాయతీలకు సంబంధించి 100% పన్ను వసూలు చేయాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. సోమవారం పీజీఆర్ఎస్ సందర్భంగా వివిధ అంశాలపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఆవాస్ ప్లస్ గ్రామిన్ యోజన-2024 సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయాలంటే ఈ సర్వేను తప్పకుండా పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
Similar News
News November 17, 2025
చలి పెరిగింది గురూ.. జాగ్రత్తగా ప్రయాణించు.!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. సాయత్రం నుంచే చలిగాలు పెరగడంతోపాటు, ఉదయానికి చలి తీవ్రత మరింతగా పెరుగుతోంది. నేడు గుంటూరు జిల్లాలో కనీస ఉష్ణోగ్రత 17°సె.గా రికార్డ్ కావడంతో ప్రజలు చలి దుస్తులు ఉపయోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున రహదారులు మంచుతో కప్పబడి ఉండటంతో ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. తెల్లవారిన తర్వాతే ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.
News November 17, 2025
చలి పెరిగింది గురూ.. జాగ్రత్తగా ప్రయాణించు.!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. సాయత్రం నుంచే చలిగాలు పెరగడంతోపాటు, ఉదయానికి చలి తీవ్రత మరింతగా పెరుగుతోంది. నేడు గుంటూరు జిల్లాలో కనీస ఉష్ణోగ్రత 17°సె.గా రికార్డ్ కావడంతో ప్రజలు చలి దుస్తులు ఉపయోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున రహదారులు మంచుతో కప్పబడి ఉండటంతో ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. తెల్లవారిన తర్వాతే ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.
News November 17, 2025
ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్టు నిరూపించినా రాజీనామా చేస్తా: గంటా

వైసీపీ హయాంలో మొదలు పెట్టి, పూర్తి చేసి ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టు చూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ చేశారు. ఎంవీపీ కాలనీ క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన అయిదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కియా వంటి చెప్పుకోదగ్గ ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయిందని మండిపడ్డారు.


