News November 17, 2025
MBNR: ముగిసిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు

మహబూబ్నగర్ జిల్లా అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు సోమవారం విజయవంతంగా ముగిశాయి. స్వామివారి ఆభరణాలను ఎస్బీఐ ఆత్మకూరు శాఖ లాకర్లో భద్రపరిచినట్లు ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి, ఛైర్మన్ జి. గోవర్ధన్ రెడ్డి తెలిపారు. జాతర నిర్వహణకు సహకరించిన వివిధ శాఖల అధికారులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జాతర అమావాస్య వరకు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
పెళ్లి రోజునే మరణశిక్ష విధించారు

బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాకు <<18311087>>ఉరిశిక్ష<<>> విధించిన సంగతి తెలిసిందే. ఈ తేదీతో ఆమెకు మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. 1967లో సరిగ్గా ఇదే తేదీన శాస్త్రవేత్త వాజెద్ మియాను హసీనా పెళ్లి చేసుకున్నారు. దీంతో పెళ్లి రోజునే ఉద్దేశపూర్వకంగా ఆమెకు మరణశిక్ష విధించారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ స్థానిక మీడియా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో ఇది రాజకీయ ప్రతీకారమేనని విమర్శిస్తున్నారు.
News November 17, 2025
పెళ్లి రోజునే మరణశిక్ష విధించారు

బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాకు <<18311087>>ఉరిశిక్ష<<>> విధించిన సంగతి తెలిసిందే. ఈ తేదీతో ఆమెకు మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. 1967లో సరిగ్గా ఇదే తేదీన శాస్త్రవేత్త వాజెద్ మియాను హసీనా పెళ్లి చేసుకున్నారు. దీంతో పెళ్లి రోజునే ఉద్దేశపూర్వకంగా ఆమెకు మరణశిక్ష విధించారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ స్థానిక మీడియా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో ఇది రాజకీయ ప్రతీకారమేనని విమర్శిస్తున్నారు.
News November 17, 2025
భీమవరం: దత్తత అవగాహన కార్యక్రమ గోడ పత్రిక ఆవిష్కరణ

జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి దత్తత తీసుకొని ప్రోత్సహించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో దత్తత అవగాహన కార్యక్రమ గోడ పత్రికను ఆవిష్కరించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు లేదా ఎక్కడైనా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటే గుర్తించి దత్తత ఇవ్వడానికి ప్రోత్సహించాలన్నారు. దత్తత ప్రక్రియను నిబంధనల మేరకు నిర్వహించాలన్నారు.


