News November 19, 2025
HYD: ఈనెల 19న పీజీ, పీహెచ్డీ ప్రవేశాలకు కౌన్సిలింగ్

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ ఈనెల 19న జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
Similar News
News March 16, 2026
KNR: రైలు పట్టాలపై ఛిద్రమైన శరీరం

KNR(D) జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల ప్రకారం.. సుమారు 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు చెప్పారు. మృతుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ప్రమాదవశాత్తూ ట్రైన్ కింద పడ్డాడా అన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. <<19391279>>నిన్న<<>> కూడా JMKTలో ఇలాగే ఓ వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే.
News March 16, 2026
NZB: ఇంటర్ అమ్మాయిలకు అద్భుత అవకాశం

ఉమ్మడి నిజామాబాదు జిల్లాలోని 71 కేజీబీవీ (KGBV) పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఏప్రిల్ 15 వరకు TGRJC CET పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.200గా నిర్ణయించారు. ప్రవేశ పరీక్ష మే 3న నిర్వహించనున్నారు. ఇందులో ఎంపికైన వారికీ జేఈఈ, నీట్, క్లాట్, ఎప్సెట్ వంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.
News March 16, 2026
కాకతీయ వర్సిటీలో నేటి నుంచి రసాయన శాస్త్ర సదస్సు

కాకతీయ విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘కెమికల్ సైన్సెస్లో ప్రస్తుత పరిశోధనలు (CRCS-2026)’ అనే అంశంపై నేటి నుంచి రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. వర్సిటీ పరిపాలన భవనంలోని సెనేట్ హాల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి వీసీ ప్రతాప్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఐఐసీటీ (హైదరాబాద్) చీఫ్ సైంటిస్ట్ గంగాగ్నిరావు కీలకోపన్యాసం చేస్తారు.


