News November 17, 2025
కుల్కచర్ల బాలుర పాఠశాలను తనిఖీ చేసిన డిఈఓ

కుల్కచర్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రేణుకాదేవి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Similar News
News November 17, 2025
ములుగు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

ములుగు జిల్లాలోని పలు మండలాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా గోవిందరావుపేట మండలంలోని పలు కిరాణా, హోటల్లు, ఇతర షాపుల్లో తనిఖీలు చేపట్టి, వ్యాపారస్థులకు పలు సూచనలు చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ మాట్లాడుతూ.. వ్యాపార సముదాయాల్లో, హోటళ్లలో గడువు దాటిన, కల్తీ వస్తువులు అమ్మొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 17, 2025
ములుగు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

ములుగు జిల్లాలోని పలు మండలాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా గోవిందరావుపేట మండలంలోని పలు కిరాణా, హోటల్లు, ఇతర షాపుల్లో తనిఖీలు చేపట్టి, వ్యాపారస్థులకు పలు సూచనలు చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ మాట్లాడుతూ.. వ్యాపార సముదాయాల్లో, హోటళ్లలో గడువు దాటిన, కల్తీ వస్తువులు అమ్మొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 17, 2025
VJA: రూ.15వేల పెన్షన్కు అర్హులైనతే సర్టిఫికెట్ పొందవచ్చు

పెరాలసిస్, మస్క్యులర్ డిస్ట్రోఫీ, తలసేమియా, కిడ్నీ వ్యాధిగ్రస్థులు, గుండె మార్పిడి వంటి తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్న ఎన్టీఆర్ జిల్లా వాసులు రూ. 15వేల పెన్షన్ పొందడానికి ప్రతి మంగళవారం విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వేంకటేశ్వరరావు సోమవారం తెలిపారు. ఉదయం 9 గంటలకు వచ్చి స్పెషలిస్టుల పరీక్షల అనంతరం సర్టిఫికెట్లు పొందాలని సూచించారు.


