News April 13, 2024

కడప: ‘ఓటమి భయంతోనే షర్మిల యాత్రకు అడ్డంకులు’

image

సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల జిల్లాలో చేపట్టిన న్యాయ యాత్రను అడ్డుకుంటున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర విమర్శించారు. జగన్ వైఫల్యాన్ని, వివేకానందరెడ్డి హత్య కేసు వివరాలను షర్మిల ప్రజలకు వివరించడంతో జగన్ లో ఓటమి భయం మొదలైందన్నారు. అందుకే వేంపల్లె, లింగాలలో అల్లరిమూకలతో అడ్డుకోవాలని చూశారన్నారు.

Similar News

News March 12, 2026

నెల రోజుల్లోగా స్మార్ట్ కిచెన్ పనులు పూర్తి చేస్తాం: కడప కలెక్టర్

image

కడప జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 33 స్మార్ట్ కిచెన్ల నిర్మాణాన్ని నెల రోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సీఎం చంద్రబాబుకు వివరించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

News March 12, 2026

కడప జిల్లాలో MSPతో శనగ పంట సేకరణ ఎంతంటే.!

image

కడప జిల్లాలో బుధవారం నాటికి 2438 మంది రైతుల నుంచి MSPతో 9963MTల శనగలను సేకరించారు. పెద్దముడియం-727, జమ్మలమడుగు-593, మైలవరం-267, ఎర్రగుంట్ల-782, కొండాపురం-335, ముద్దనూరు-822, ప్రొద్దుటూరు-630, రాజుపాలెం-724, కమలాపురం-1120, వల్లూరు-532, పెండ్లిమర్రి-811, VNపల్లె-603, పోరుమామిళ్ల-145, దువ్వూరు-93, వేంపల్లె-332, వేముల-530, సింహాద్రిపురం-217, తొండూరు-176, లింగాల-255, పులివెందుల-262MTలు సేకరించారు.

News March 11, 2026

కడప: వీరికి డాక్టరేట్లు ఇవ్వనున్న వైవీయూ

image

YVU స్నాతకోత్సవంలో ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయనున్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. తేలికపాటి యుద్ధ విమానాల రూపకర్త డా.కోటా హరినారాయణ, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమి ప్రెసిడెంట్ డా. శేఖర్. సి. మండేలకు గౌరవ డాక్టరేట్‌లను గవర్నర్ అబ్దుల్ నజీర్ అందజేస్తారన్నారు. వీరి జీవితం నేటితరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.