News November 19, 2025
9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు

AP: పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు నిన్న అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 9.2 కేజీల బంగారంతో తయారు చేసిన సత్యసాయి విగ్రహాన్ని వెండి రథంలో పట్టణంలో ఊరేగించారు. భక్తజన సంద్రమైన ప్రశాంతి నిలయంలో ‘సురంజలి’ పేరుతో సంగీత కార్యక్రమం జరిగింది. నేడు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యరాయ్ తదితర ప్రముఖులు జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
Similar News
News March 18, 2026
HYD: ‘అగ్నివీర్’లో దరఖాస్తుల ఆహ్వానం

అగ్నివీర్ నియామకాలకు అర్హులైన యువత <
News March 18, 2026
భారత్లో తెలంగాణ అంతర్భాగం కాదా: మంత్రి పొన్నం

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ఫైరయ్యారు. ‘BJP నుంచి 8 మంది MPలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. రాష్ట్రానికి ఏం తెచ్చారు? రావాల్సిన నిధులు చాలా పెండింగ్లో ఉన్నాయి. భారత్లో TG అంతర్భాగం కాదా? నిధులు ఎందుకు కేటాయించరు? రాష్ట్ర ఏర్పాటు విషయంలో తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని BJP కేంద్ర నేతలు అంటే రాష్ట్ర నేతలు ఎందుకు మాట్లాడలేదు’ అని ప్రశ్నించారు.
News March 18, 2026
ఇంటికే గ్యాస్.. ఏజెన్సీల వద్ద వేచి ఉండొద్దు: కేంద్రం

గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్ద గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఏజెన్సీల వద్దకు వెళ్లొద్దని, సిలిండర్లను నేరుగా ఇంటికే పంపిణీ చేస్తామని వెల్లడించింది. IVRS, వాట్సాప్, మొబైల్ యాప్, <<19379922>>మిస్డ్కాల్<<>>, UPI యాప్స్ల ద్వారా బుక్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలు ఆందోళన చెందకుండా ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించింది.


