News November 19, 2025
NGKL: మంత్రాలయానికి బస్సు.. ఫోన్ చేయండి!

కార్తీక బహుళ అమావాస్య పురస్కరించుకుని NGKL డిపో నుంచి డిలక్స్ బస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య ‘Way2News’తో తెలిపారు. ఈనెల 20న NGKL నుంచి మధ్యాహ్నం బయలుదేరి, మంత్రాలయం(రాఘవేంద్ర స్వామి), పంచముఖి ఆలయం దర్శనం, ఆంజనేయ స్వామి ఆలయంలో బస ఉదయం పంచముఖి నుంచి బయలుదేరి జోగులాంబ అమ్మవారి దర్శనం అనంతరం తిరిగి ప్రయాణం అన్నారు. ఛార్జీ రూ.1000. వివరాలకు 94904 11591, 94904 11590కు ఫోన్ చేయాలన్నారు.
Similar News
News April 3, 2026
కృష్ణా : సర్పంచ్ల పాలనకు సెలవ్..!

కృష్ణా జిల్లాలో గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. సర్పంచ్ల పదవీ కాలం ముగియటంతో నేటి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రభుత్వం మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది. జిల్లాలో మొత్తం 497 పంచాయతీలు ఉండగా వివిధ కారణాల వల్ల 17 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. మిగిలిన 470 పంచాయతీల సర్పంచ్ టైమ్ అయిపోవటంతో అక్కడ ప్రత్యేక అధికారులను నియమించారు.
News April 3, 2026
SRPT: నాడు అటెండర్.. నేడు అదే ఆఫీసులో MRO

నడిగూడెం తహశీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన సోమపంగు సూరయ్య ప్రస్థానం అందరికీ స్ఫూర్తినిస్తోంది. 1995లో తండ్రి మరణంతో కారుణ్య నియామకం కింద అదే కార్యాలయంలో అటెండర్గా ఆయన వృత్తి జీవితం ప్రారంభించారు. పట్టుదలతో విద్యా అర్హతలు పెంచుకుంటూ, శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అంచెలంచెలుగా ఎదిగారు. నాడు అటెండర్గా పనిచేసిన చోటే నేడు ఉన్నతాధికారిగా పీఠం అధిరోహించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
News April 3, 2026
రూ.900 కోట్లతో వీఎంఆర్డీఏ బడ్జెట్

విశాఖలోని వీఎంఆర్డీఏ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.900 కోట్ల బడ్జెట్ను సిద్ధం చేసింది. బోర్డు ఆమోదం అనంతరం అమలు చేస్తామని కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. అదనంగా రూ.1000 కోట్ల ఆదాయం కోసం కొత్త లేఅవుట్లు అభివృద్ధి చేసి, ప్లాట్లు వేలం వేయనున్నారు. మాస్టర్ ప్లాన్-2041 అభ్యంతరాల నివేదికను వారం రోజుల్లో ప్రభుత్వానికి పంపించనున్నారు. పర్యాటక టికెట్ విధానంపై విస్తృత ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు.


