News November 17, 2025

వనపర్తి: ధాన్యం ఆన్‌లైన్ ఎంట్రీలో ఆలస్యం.. అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

image

వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 291 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఇందులో 10,682 MT ధాన్యాన్ని మిల్లులకు తరలించినా, 6 వేల మెట్రిక్ టన్నులకు మాత్రమే ఆన్‌లైన్ ఎంట్రీ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 876 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి మాత్రమే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News November 18, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 18, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 18, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 18, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 18, 2025

ములుగు: మంత్రి సీతక్కా.. ఇటు చూడక్క..!

image

జ్వరంతో బాధపడుతున్న ఓ గుత్తికోయ వ్యక్తిని డోలిలో ఆసుపత్రికి తీసుకొచ్చిన ఘటన మంత్రి సీతక్క సొంత జిల్లా అయిన ములుగు పరిధి వెంకటాపురంలో జరిగింది. పామూరుకు చెందిన మడవి ఆడుమ అనే వ్యక్తి 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానికులు గమనించి పామూరు గుట్టలపై నుంచి ఓ కర్రకు డోలీ కట్టి బొల్లారానికి, అక్కడి నుంచి 108లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్ MGMకు తరలించారు.