News April 13, 2024
చర్లపల్లి జైల్లో డ్రగ్స్ కోసం ఖైదీల ఆందోళన

TG: తమకు డ్రగ్స్ కావాలంటూ హైదరాబాద్లోని చర్లపల్లి జైలు ఖైదీలు ఆందోళన చేపట్టారు. డ్రగ్స్కు అలవాటు పడిన విచారణ ఖైదీలు అక్కడి సిబ్బందిపై తిరగబడ్డారు. దీంతో జైలు అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ప్రత్యేక బ్యారక్లోకి తరలించినట్లు తెలుస్తోంది. దీనిపై జైలు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.
Similar News
News March 8, 2026
కేజీ చికెన్ ధర ఎంత ఉందంటే?

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు ₹300కు చేరాయి. హైదరాబాద్లో కేజీ స్కిన్లెస్ ₹290-300, ఆసిఫాబాద్లో ₹300, వరంగల్లో ₹290, కామారెడ్డిలో ₹280-300 పలుకుతోంది. ఏపీలోని విజయవాడలో ₹300గా ఉంది. మరోవైపు గుడ్ల రేట్లు మాత్రం భారీగా తగ్గాయి. 30 గుడ్లు ఉండే ట్రే ధర ₹130-140కి పడిపోయింది. ఇక మటన్ కేజీ ₹800-1000గా ఉంది. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.
News March 8, 2026
విశాఖ నుంచి వెళ్లిన 10 వేల కంటైనర్లు వెనక్కి!

AP: US&ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి <<19285220>>మూతబడటం<<>> తెలిసిందే. దీంతో విశాఖ పోర్టు నుంచి సరకులతో వెళ్లిన నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ క్రమంలో వాటిని వెనక్కి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుమారు 10 వేల కంటైనర్లు వెనక్కి వస్తాయని విశాఖ కంటైనర్ టెర్మినల్ అధికారులు అంచనా వేశారు. వాటిని ఉంచేందుకు స్థలం కేటాయించాలని పోర్టుకు లేఖ రాశారు.
News March 8, 2026
ఈమె ఎదురీత ముందు విధిరాత ఎంత!

పదేళ్లు వీల్ఛైర్కు పరిమితమైన యువతి సివిల్స్ ఫలితాల్లో 483వ ర్యాంకు సాధించారు. ఆమెనే కేరళకు చెందిన అథిర(30). BDS చదువుతుండగా యాక్సిడెంట్ జరగడంతో తల, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. ఛాతీ కింది భాగం ప్యారలైజ్ అయిపోయింది. రెండేళ్లు జ్ఞాపకశక్తి కూడా లేదు. ఆ తర్వాత BDS పూర్తి చేశారు. NGOలోని డిసెబిలిటీ వింగ్లో పనిచేయడంతో ఆత్మ విశ్వాసం పెరిగిందని, పేరెంట్స్&సిస్టర్ సాయంతో చదివానని అథిర తెలిపారు.


