News November 19, 2025
ఆపరేషన్ కగార్.. వరంగల్ అన్నల రక్త చరిత్ర..!

కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ దాడుల్లో ఉమ్మడి WGL జిల్లాకు చెందిన పలువురు కీలక మావోయిస్టు నేతలు ఈ ఏడాదిలో హతమయ్యారు. సెప్టెంబర్ 11న ఛత్తీస్గఢ్ గరియాబాద్ అడవుల్లో మడికొండకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ మృతి చెందగా, జూన్ 18న ఏవోబీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేశ్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అలాగే రేణుక, సారయ్య, రాకేశ్ కూడా బీజాపూర్, అబూజ్మడ్ అడవుల్లో మృతి చెందారు.
Similar News
News March 25, 2026
హుజూర్నగర్, కోదాడపై డీలిమిటేషన్ ఎఫెక్ట్!

రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియతో హుజూర్నగర్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దుల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని పబ్లిక్ టాక్. ఈ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా సాంద్రత, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా కొన్ని మండలాలను ఇతర నియోజకవర్గాల్లో కలపడం లేదా కొత్తవి చేర్చడం జరిగే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పొరుగున ఉన్న నియోజకవర్గాల విభజన జరిగితే ఆ ప్రభావం నేరుగా HNR, KDDలపై పడనుంది.
News March 25, 2026
రాజధాని అమరావతిపై ఈ నెల 28న తీర్మానం

AP: ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ సభలో తీర్మానం చేయనున్నారు. అనంతరం తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
News March 25, 2026
HYD: ఇంధనంపై తప్పుడు ప్రచారం చేస్తే కఠినచర్యలు

HYDలో ఇంధన కొరత లేదని పోలీసులు స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. కొరత ఉందని తప్పుడు ప్రచారం చేస్తే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమ నిల్వలు చేసి కృత్రిమ కొరత సృష్టించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. నిన్నటి నుంచి నగరంలో పెట్రోల్పై నెలకొన్న పుకార్లపై పోలీసులు సీరియస్ అయ్యారు.


