News November 19, 2025

పుట్టపర్తిలో మోదీ ‘గో-గిఫ్ట్’.. 100 ఆవుల దానం

image

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా నేడు పుట్టపర్తికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ తన దాతృత్వాన్ని చాటనున్నారు. గుజరాత్‌కు చెందిన 100 జీఐఆర్ ఆవులను ప్రశాంతి నిలయానికి విరాళంగా అందజేయనున్నారు. వీటిని జిల్లా రైతులకు అందజేయనున్నట్లు తెలిసింది. రోజుకు 10 నుంచి 15 లీటర్ల పాలు ఇచ్చే ఈ ఆవులు రైతులకు ఆర్థికంగా తోడ్పాటునివ్వనున్నాయి.

Similar News

News March 19, 2026

సీతారాముల కళ్యాణానికి గవర్నర్‌కు ఆహ్వానం

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరగనున్న సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర గవర్నర్ S.అబ్దుల్ నజీర్‌ను టీటీడీ AEO వెంకయ్య చౌదరి ఆహ్వానించారు. ఆలయ అర్చకుల మంత్రోచ్ఛారణల నడుమ గవర్నర్‌కు ఆహ్వానం పలికారు. వారి వెంట ఆలయ ఇన్‌ఛార్జ్ DEO శివప్రసాద్, అర్చకులు ఉన్నారు.

News March 19, 2026

ఆయిల్ టెన్షన్.. ₹10లక్షల కోట్లు ఆవిరి

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 2496 పాయింట్లు కోల్పోయి 74,207 వద్ద సెటిల్ అవగా నిఫ్టీ 775 పాయింట్ల నష్టంతో 23,002 వద్ద సెటిల్ అయింది. ₹10లక్షల కోట్లకుపైన ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బ్రెంట్ క్రూడ్ 118.14 డాలర్లకు, ముర్బాన్ క్రూడ్ 128.84 డాలర్లకు చేరడం మార్కెట్లను కుదిపేసింది. FII సెల్లింగ్, HDFC బ్యాంక్ షేర్లలో భారీ అమ్మకాలు మార్కెట్‌పై ప్రభావం చూపించాయి.

News March 19, 2026

పాలమూరు: గంజాయి కలకలం.. యువకుల అరెస్ట్

image

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలో గురువారం గంజాయి కలకలం రేపింది. మండలానికి చెందిన పలువురు యువకులు హైదరాబాద్ నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంజాయి కొనుగోలు చేస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా ఐదుగురిని అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై హన్మంత్ రెడ్డి తెలిపారు. ఒక యువకుడు పరారీలో ఉన్నాడు.