News November 19, 2025

జాతీయ జల అవార్డు అందుకున్న నల్గొండ జిల్లా

image

జల్ సంజయ్ & జన్ భగీదరి కార్యక్రమంలో దేశంలో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా నల్గొండ ద్వితీయ స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్‌డీఏ పీడీ శేఖర్ రెడ్డి 6వ జాతీయ జల అవార్డు (రూ.2 కోట్ల ప్రైజ్ మనీ, ప్రశంసా పత్రం)ను అందుకున్నారు. వారికి పలువురు అభినందనలు తెలిపారు.

Similar News

News March 21, 2026

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

image

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు 30 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో కఠోర దీక్షలు, ప్రార్థనలు చేశారని ఆయన పేర్కొన్నారు. అల్లా దయతో వారందరి జీవితాల్లో సంతోషం, వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా ఆయన ఆకాంక్షించారు. ముస్లింల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు.

News March 21, 2026

NLG: వరి కోతల వేళ.. వరుణుడి గోల

image

జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన వరి పంట కోత దశకు చేరుకుంది. ఆయకట్టు ప్రాంతంలో ఎటుచూసినా పచ్చని పొలాలు మరో వారం, పది రోజుల్లో జిల్లాలో కోతల సందడి మొదలుకానుంది. అయితే, గత కొద్ది రోజులుగా ఆకాశం మబ్బులు పడుతుండడంతో రైతన్నల్లో వరుణుడి భయం వెంటాడుతోంది. ఈ రబీ సీజన్‌లో సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు, వివిధ చెరువులు, బోర్ల కింద జిల్లావ్యాప్తంగా సుమారు 5.56 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.

News March 21, 2026

NLG: వరి కోతల వేళ.. వరుణుడి గోల

image

జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన వరి పంట కోత దశకు చేరుకుంది. ఆయకట్టు ప్రాంతంలో ఎటుచూసినా పచ్చని పొలాలు మరో వారం, పది రోజుల్లో జిల్లాలో కోతల సందడి మొదలుకానుంది. అయితే, గత కొద్ది రోజులుగా ఆకాశం మబ్బులు పడుతుండడంతో రైతన్నల్లో వరుణుడి భయం వెంటాడుతోంది. ఈ రబీ సీజన్‌లో సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు, వివిధ చెరువులు, బోర్ల కింద జిల్లావ్యాప్తంగా సుమారు 5.56 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.