News November 19, 2025
ఉత్తరాంధ్రలో అంచనాల కమిటీ పర్యటన

AP అంచనాల కమిటీ ఈనెల 25-29 వరకు ఉత్తరాంధ్రలో పర్యటించనుంది. ఛైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన కమిటీ సభ్యులు 25న విశాఖ చేరుకుంటారు. 26న సింహాచలంలో స్వామిని దర్శనం చేసుకొని.. దేవాదాయ శాఖ అధికారులతో సమావేశమౌతారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో చర్చించనున్నారు. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన పనులకు సంబంధించిన అంశాలపై సమీక్షిస్తారు.
Similar News
News April 1, 2026
లిక్కర్ సేల్స్లో విశాఖనే టాప్

మద్యం విక్రయాల్లో రాష్ట్రంలో విశాఖ ప్రథమ స్థానంలో నిలిచింది. విశాఖలో 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.2010.95 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఇందులో మద్యం బాక్సులు 23.63 లక్షలు, బీర్ బాక్సులు19.78 లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1943.58కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా.. 2025-26లో దీనిపై 3శాతం పెరిగాయి.
News April 1, 2026
జిల్లా పరిషత్తు లేని జిల్లాగా విశాఖ..?

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ విభజనపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాల్లోని 64 గ్రామాలు మినహా మిగతా ప్రాంతం జీవీఎంసీ పరిధిలో ఉంది. ఈ గ్రామాలను జీవీఎంసీలో విలీనం చేయాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. అయితే అలా చేస్తే ZPTC, MPTCలు లేని జిల్లాగా మారే పరిస్థితి ఉంది. విలీనం చేయకపోతే ఈ 3 మండలాలతోనే జిల్లా పరిషత్ కొనసాగిస్తారా? అన్నదానిపై అనిశ్చితి నెలకొంది.
News April 1, 2026
జీవీఎంసీకి రికార్డు స్థాయి వసూళ్లు

జీవీఎంసీ 2025 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూళ్లలో రికార్డు సృష్టించింది. మొత్తం రూ.620.08 కోట్లు వసూలు చేసి గత ఏడాదితో పోలిస్తే గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రూ.510.15 కోట్లు వసూలు కాగా, ఈసారి సుమారు రూ.109 కోట్లు అధికంగా రావడం విశేషం. ముఖ్యంగా మార్చి 31 లోపు బకాయిలు (అరియర్స్) చెల్లిస్తే వడ్డీపై 50% రాయితీ ప్రకటించడంతో చెల్లింపుదారులు ముందుకు వచ్చారు.


