News November 19, 2025
ఉత్తరాంధ్రలో అంచనాల కమిటీ పర్యటన

AP అంచనాల కమిటీ ఈనెల 25-29 వరకు ఉత్తరాంధ్రలో పర్యటించనుంది. ఛైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన కమిటీ సభ్యులు 25న విశాఖ చేరుకుంటారు. 26న సింహాచలంలో స్వామిని దర్శనం చేసుకొని.. దేవాదాయ శాఖ అధికారులతో సమావేశమౌతారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో చర్చించనున్నారు. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన పనులకు సంబంధించిన అంశాలపై సమీక్షిస్తారు.
Similar News
News March 6, 2026
విశాఖ నగరంలో నీటి సరఫరా ఎంతంటే..?

నగరంలో నీటి వినియోగం లభ్యత విషయాలపై జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. 24 లక్షల జనాభాకు గత ఏడాది నుంచి 453MLD అవసరం కాగా 390MLD సరఫరా జరుగుతుందని, భవిష్యత్తులో వినియోగం రెండు రెట్లు పెరుగుతుందని తెలిపారు. రీసైక్లింగ్ పద్ధతిలో నీటిని వాడుకునే విధానాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
News March 6, 2026
మార్చి 10 లోపు TIS డేటాను డిక్లరేషన్ అందించాలి: డీఈవో

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు విశాఖ జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మార్చి 10 లోపు TIS డేటాను డిక్లరేషన్ అందించాలని డీఈవో ప్రేమ్ కుమార్ గురువారం తెలిపారు. 10వ తేదీ తరువాత డిక్లరేషన్ ఫారంలు స్వీకరించరన్నారు.
News March 6, 2026
మార్చి 10 లోపు TIS డేటాను డిక్లరేషన్ అందించాలి: డీఈవో

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు విశాఖ జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మార్చి 10 లోపు TIS డేటాను డిక్లరేషన్ అందించాలని డీఈవో ప్రేమ్ కుమార్ గురువారం తెలిపారు. 10వ తేదీ తరువాత డిక్లరేషన్ ఫారంలు స్వీకరించరన్నారు.


