News April 13, 2024
విశాఖ: రాళ్లతో కొట్టి యువకుడి దారుణ హత్య

విశాఖపట్నం అరిలోవ కృష్ణపురంలో యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. యువకుడిని రాళ్లతో కొట్టి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
Similar News
News October 6, 2025
విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు

భారత మహిళా క్రికెట్ జట్టు సోమవారం రాత్రి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు జట్టుకు స్వాగతం పలికారు. గురువారం దక్షిణ ఆఫ్రికా జట్టుతో భారత జట్టు పీఎం పాలెం స్టేడియం వేదికగా తలపడనుంది. మంగళ, బుధవారాల్లో మహిళా జట్టు స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నారు. ఈ మ్యాచ్ టికెట్ల కోసం క్రీడాభిమానులు కొనుగోలు కోసం ఆసక్తి చూపుతున్నారు.
News October 6, 2025
విశాఖకు టాటా గ్రూప్ చైర్మన్ను ఆహ్వానించిన మంత్రి

టాటా గ్రూపు ఛైర్మన్ చంద్రశేఖరన్తో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబైలో భేటీ అయ్యారు. విశాఖపట్నంలో ఈ నెలలో నిర్వహించనున్న టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిలో టాటా భాగస్వామ్యం కావాలని, అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
News October 6, 2025
ఏయూ: ఎంటెక్ ఈవినింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

స్థానికంగా ఉద్యోగాలు చేస్తున్నవారికి ఎంటెక్ ఈవినింగ్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవాళ ఆంధ్ర విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఆసక్తి అర్హత కలిగిన వారు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 17వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించి, అర్హత కలిగిన వారికి ప్రవేశాలు కల్పిస్తారు. పూర్తి వివరాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్సైట్, ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో సంప్రదించాలి.