News November 19, 2025
NLG: మహిళా సంఘాల పేరుతో రూ.1.50 కోట్లు స్వాహా

నల్గొండ పట్టణంలోని 3వ వార్డు పాతపల్లెకు చెందిన 12 సంఘాల పేరున ఆ గ్రామానికి చెందిన బుక్ కీపర్ ఒకరు బ్యాంకు ఫీల్డ్ అధికారులతో కలిసి కుమ్మక్కై కోటిన్నర రుణాలు తీసుకున్నారు. 4నెలల నుంచి చెల్లింపులు ఆగడంతో బ్యాంకు సిబ్బంది బాధితుల దగ్గరికి వెళ్లగా తమకేం తెలియదని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. బుక్ కీపర్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు మంగళవారం బ్యాంకు ముందు నిరసన తెలిపారు.
Similar News
News March 12, 2026
క్రాష్ కంటిన్యూ.. 800 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ క్లోజ్

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 829 పాయింట్లు కోల్పోయి 76,034కు చేరగా.. నిఫ్టీ 227 పాయింట్ల నష్టంతో 23,639 వద్ద సెటిల్ అయింది. సెన్సెక్స్ టాప్ 30 సూచీలో NTPC, టెక్ మహీంద్రా, పవర్గ్రిడ్, HCL టెక్ మినహా ఇతర సూచీలన్నీ నష్టాలతోనే ముగిశాయి. క్రూడ్ ఆయిల్ ధరల హైక్, భారత్ సహా 16 దేశాలపై ట్రేడ్ దర్యాప్తుకు ట్రంప్ ఆదేశించడం, FII సెల్లింగ్, రూపీ క్షీణత సూచీలపై ప్రభావం చూపించింది.
News March 12, 2026
సచిన్ను తప్పించాలనుకున్నాం: మాజీ సెలక్టర్

‘సచిన్ మీ ప్లాన్స్ ఏంటి? మిమ్మల్ని తప్పించి వేరే ప్లేయర్ను తీసుకోవాలనుకుంటున్నాం’ అని చెప్పగానే టెండూల్కర్ షాకయ్యారని మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ తెలిపారు. ‘మీరు సీరియస్గానే అంటున్నారా?’ అని సచిన్ తిరిగి ప్రశ్నించగా అవునని సమాధానం ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. నిజానికి సచిన్ మరికొంత కాలం ఆడాలనుకున్నారని చెప్పారు. 2013లో రిటైర్మెంట్కు ముందు జరిగిన ఘటనలను పాటిల్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
News March 12, 2026
NLG: ఒంటిపూట కూడా మిడ్ డే మీల్స్

ఎండల తీవ్రత దృష్ట్యా మార్చి 15 నుంచి విద్యా సంవత్సరం చివరి పనిదినం (ఏప్రిల్ 23) వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సగం రోజు మాత్రమే పని చేస్తాయి. ఉదయం 8 గంటల నుంచి మ.12:30 గంటల వరకు తరగతులు నిర్వహించి, అనంతరం మధ్యాహ్న భోజనం అందిస్తారు. పదో తరగతి పరీక్షలు జరిగే రోజున మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సా.5 వరకు తరగతులు నడుస్తాయని DEO భిక్షపతి గురువారం తెలిపారు. ఈ సమయంలో కూడా మధ్యాహ్న భోజనం పెడతారు.


