News November 19, 2025
నేడే PM కిసాన్ 21వ విడత డబ్బుల జమ

PM కిసాన్ 21వ విడత నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. రబీ పంట పెట్టుబడి సాయం కింద దేశ వ్యాప్తంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున ప్రధాని మోదీ జమ చేయనున్నారు. 2019 FEB-24న PM కిసాన్ ప్రారంభించగా ఇప్పటి వరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో జమ చేశారు. పీఎం కిసాన్ పోర్టల్లో నమోదై, బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయిన రైతులకే ఈ పథకం ప్రయోజనం అందనుంది.
Similar News
News March 31, 2026
ఈనాటి ముఖ్యాంశాలు

➤ భారత్ ఇప్పుడు మావోయిస్టు రహిత దేశం: అమిత్ షా
➤ SSY, PPF వడ్డీ రేట్లు యథాతథం
➤ భారత భవిష్యత్తును మోదీ తాకట్టుపెట్టారు: రాహుల్
➤ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో CBNకు ఊరట
➤ మావోయిస్టు ఫ్రీ రాష్ట్రంగా ఏపీ: DGP
➤ సన్నబియ్యంతో లంచ్ చేసిన సీఎం, TG MLAలు
➤ KCRను గృహ నిర్బంధం చేశారని నా అనుమానం: CM రేవంత్
➤ IPL: RRపై చిత్తుగా ఓడిన CSK
News March 31, 2026
ప్రొటీన్ కోసం ఈ ఆహారాలు తీసుకోండి: నిపుణులు

శాకాహారులు ప్రొటీన్ కోసం పనీర్, పప్పులపైనే ఆధారపడకుండా ఇతర ఆహారాలనూ తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలు, టోఫు (సోయాబీన్స్ నుంచి తయారు చేస్తారు), టెంపే, పచ్చి సోయా గింజలు, హంగ్ కర్డ్, రాజ్గిరా, జనపనార గింజలు (ప్రొటీన్, ఒమేగా-3 కొవ్వులు, ఖనిజాలు అధికంగా ఉంటాయి) ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. వీటి వల్ల జీవక్రియ మెరుగుపడటం, కొవ్వు తగ్గడంతో పాటు అనేక లాభాలున్నాయని అంటున్నారు.
News March 31, 2026
స్పానిష్లో ‘దృశ్యం’ రీమేక్

మలయాళ థ్రిల్లర్ మూవీ <<19460122>>‘దృశ్యం’ <<>>ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇప్పటికే తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషలతోపాటు శ్రీలంక, చైనాలోనూ రీమేక్ అయ్యింది. తాజాగా ఈ చిత్రాన్ని స్పానిష్లో తెరకెక్కించనున్నట్లు నిర్మాత రోడ్రిగో ఎస్పినెల్ ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్లో వెల్లడించారు. ‘ఇదొక ఇంట్రెస్టింగ్ స్టోరీ. స్పానిష్ కల్చర్కు అనుగుణంగా మార్పులు చేస్తాం. జూన్లో షూటింగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు.


