News November 19, 2025

నేడే PM కిసాన్ 21వ విడత డబ్బుల జమ

image

PM కిసాన్ 21వ విడత నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. రబీ పంట పెట్టుబడి సాయం కింద దేశ వ్యాప్తంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున ప్రధాని మోదీ జమ చేయనున్నారు. 2019 FEB-24న PM కిసాన్ ప్రారంభించగా ఇప్పటి వరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో జమ చేశారు. పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదై, బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ అయిన రైతులకే ఈ పథకం ప్రయోజనం అందనుంది.

Similar News

News March 24, 2026

పశ్చిమాసియా సంక్షోభం.. కేంద్ర మంత్రుల కీలక భేటీ

image

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పార్లమెంటు హౌస్‌లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కీలక భేటీ జరుగుతోంది. ఈ మీటింగ్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఎరువుల మంత్రి నడ్డా హాజరయ్యారు. మరోవైపు ఇదే అంశంపై రేపు ఆల్ పార్టీ మీటింగ్‌కు కేంద్రం <<19464829>>పిలుపునిచ్చిన<<>> విషయం తెలిసిందే.

News March 24, 2026

రాజస్థాన్ రాయల్స్ విక్రయం!

image

IPL ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌ను అమెరికా వ్యాపారవేత్త కల్ సొమానీ కొనుగోలు చేశారు. మెజారిటీ వాటాదారు ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ నుంచి రూ.15,300 కోట్ల($1.63B)కు ఆయన ఆధ్వర్యంలోని కన్సార్షియం సొంతం చేసుకున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. ఈ IPL సీజన్ నుంచే ఇది అమల్లోకి రావచ్చని చెప్పింది. టోర్నీ చరిత్రలో ఇదే బిగ్గెస్ట్ డీల్ అని తెలుస్తోంది. మనోజ్ బదాలే(ఎమర్జింగ్ మీడియా వెంచర్స్)కు RRలో 65% వాటా ఉంది.

News March 24, 2026

TDP ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేనకు అన్యాయం: బొలిశెట్టి

image

AP: TDP MLAలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేనకు న్యాయం జరగడం లేదని ఆ పార్టీ MLA బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. ‘మా MLAలు ఉన్న చోట TDPకి ప్రాధాన్యమిస్తున్నాం. మాకూ అదే గౌరవం దక్కాలని కోరుకుంటున్నాం. CBN, లోకేశ్ సహకరిస్తున్నా కింది స్థాయిలో అలా లేదు. త్వరలో సమన్వయ సమావేశంలో చర్చిస్తాం. పార్టీలో ఉన్న అసంతృప్తిపై JSPLP భేటీలో పవన్ దృష్టికి తీసుకెళ్లాం’ అని వెల్లడించారు.