News November 19, 2025
నేడే PM కిసాన్ 21వ విడత డబ్బుల జమ

PM కిసాన్ 21వ విడత నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. రబీ పంట పెట్టుబడి సాయం కింద దేశ వ్యాప్తంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున ప్రధాని మోదీ జమ చేయనున్నారు. 2019 FEB-24న PM కిసాన్ ప్రారంభించగా ఇప్పటి వరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో జమ చేశారు. పీఎం కిసాన్ పోర్టల్లో నమోదై, బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయిన రైతులకే ఈ పథకం ప్రయోజనం అందనుంది.
Similar News
News March 22, 2026
వాట్సాప్లో కొత్త ఫీచర్.. 15minలో మెసేజ్ డిలీట్!

వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్ రానుంది. దీనిని యూజర్లు ఎనేబుల్ చేసుకుంటే చాట్ లోని మెసేజ్లు వాటికవే డిలీట్ అవుతాయి. మెసేజ్ ఓపెన్ చేసిన టైమ్ నుంచి 15min కౌంట్ డౌన్ మొదలవుతుంది. అది పూర్తవగానే సెండర్, రిసీవర్ చాట్లో మెసేజ్ మాయమవుతుంది. ఓపెన్ చేయని మెసేజ్లు 24hrs వరకూ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్మెంట్ దశలో ఉంది. OTP, పాస్వర్డ్స్ వంటి వివరాలు షేర్ చేసే వారికి ఇది ఉపయోగపడొచ్చు.
News March 22, 2026
SRH 250 స్కోర్ చేసినా లాభం లేదు: ఆకాశ్ చోప్రా

IPL-2026లో SRH జట్టు 250 రన్స్ చేసినా లాభం లేదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. ఆ జట్టులో బ్యాటర్లు 250 పరుగులు చేస్తే బౌలర్లు కూడా 250 పరుగులు సమర్పించుకుంటారని పేర్కొన్నారు. అంత బలహీనంగా ఆ జట్టు బౌలింగ్ ఉందని అన్నారు. ‘కమిన్స్, ఎషాన్ మలింగా అందుబాటులో లేకపోవడంతో బ్రైడన్ కార్స్ను ఆడించాల్సి వస్తుంది. ఇండియన్ బౌలర్లతో మేనేజ్ చేయడమూ సవాలే’ అని పేర్కొన్నారు.
News March 22, 2026
ఇండియాలో ఎక్కువ బ్రాంచులు ఉన్న బ్యాంకులు ఇవే

1. SBI- 23,085
2. పంజాబ్ నేషనల్ బ్యాంక్- 10,228
3. కెనరా బ్యాంక్- 9,948
4. HDFC- 9,545
5. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 8,655
6. బ్యాంక్ ఆఫ్ బరోడా- 8,424
7. ICICI- 7,246
8. యాక్సిస్ బ్యాంక్- 5,976
9. ఇండియన్ బ్యాంక్- 5,955 10. బ్యాంక్ ఆఫ్ ఇండియా- 5,375


