News November 19, 2025
KNL: పిల్లల హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కన్నబిడ్డలను చంపిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2018లో సింధ్ ధనోజీ రావు తన కూతురు నిఖిత (7), కొడుకు మధు చరణ్ (4)ను నంద్యాల జిల్లాలోని జూపాడుబంగ్లా ప్రాంతంలో నీటి కుంటలో ముంచి చంపాడు. ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో కర్నూలులోని 7వ న్యాయస్థానం జడ్జి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News March 5, 2026
సిరిసిల్ల: ఇంటర్ పరీక్షలకు 79 మంది గైర్హాజరు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం MATHS B/History/Zoology PAPER-I పరీక్షల్లో 79 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులకు తెలిపారు. మొత్తం 3,531 మంది విద్యార్థులకు గాను 3,452 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర పరిశీలకుడు గురువారెడ్డి, DIEO, DEC పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.
News March 5, 2026
రేపు నిజామాబాద్ రానున్న ఈటల రాజేందర్

మాజీ మంత్రి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం నిజామాబాద్కు రానున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ తరుఫున గెలిచిన కౌన్సిలర్, కార్పొరేటర్ల ఆత్మీయ అభినందన సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్తో కలిసి పాల్గొననున్నారు.
News March 5, 2026
యువతకు సాంకేతిక నైపుణ్యం అవసరం: కలెక్టర్ అనురాగ్ జయంతి

యువత సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకుంటేనే మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం ఆలేరులోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC), ఐటిఐలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి కోర్సుల శిక్షణను పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు. సృజనాత్మక ఆలోచనలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ప్రిన్సిపల్ హరికృష్ణ పాల్గొన్నారు.


