News November 19, 2025

వల్లభాపురం: ప్రమాదవశాత్తు యంత్రంలో పడి మహిళ మృతి

image

కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మాదిగ లంకకు మినుములు నూర్చడానికి వచ్చిన మహిళ ప్రమాదవశాత్తు చనిపోయినట్లు కొల్లిపర ఎస్సై పి.కోటేశ్వరరావు తెలిపారు. వల్లూరుపాలెంకు చెందిన షేక్ కాసింబి(40) ప్రమాదవశాత్తు మినుము నూర్పిడి యంత్రంలో చీర ఇరుక్కుని చేతులు, మెడకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు తెలిపారు. ఆమె భర్త ఇస్మాయిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Similar News

News March 8, 2026

పాలమూరు నుంచి పార్లమెంట్ దాకా..!

image

తెలంగాణలో బలమైన మహిళా నేత్రిగా పేరుపొందిన DK అరుణ ఆరుపదుల వయసులో కూడా జోష్‌తో సాగుతున్నారు. 1960 మే 4న నారాయణపేట్‌లో జన్మించారు. 18 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. గద్వాల నుంచి 2004-2018 వరకు MLA, వైఎస్‌, రోశయ్య కేబినెట్‌ల్లో మంత్రిగా 2019లో BJPలో చేరి జాతీయ ఉపాధ్యక్షురాలు, MPగా కొనసాగుతూ.. మహిళల సాధికారతకు విశేష సేవలు అందిస్తున్నారు. # నేడు ప్రపంచ మహిళా దినోత్సవం.

News March 8, 2026

అన్నింటా నువ్వే.. వందనాలమ్మా!

image

ఆమె.. మల్టీ టాస్కింగ్ చేయగల నేర్పరి. తల్లిగా, భార్యగా, కోడలిగా ఏకకాలంలో బాధ్యతలు నెరవేర్చగల ఎక్స్‌పర్ట్. ఇంట్లో జీతం తీసుకోని, రిటైర్మెంట్ లేని ఉద్యోగి. కుటుంబాన్ని నడిపించే ఆర్థికవేత్త. ఓపిక ఆమె బలం.. సహనం ఆమె ఆభరణం.. ప్రేమ పంచడంలో దైవం. అవకాశాల్ని అందిపుచ్చుకుని, అడ్డంకులను దాటుకుని, తమను తాము నిరూపించుకుని ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే ప్రతి మహిళకు వందనం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

News March 8, 2026

అమలాపురం మహిళల ప్రతిభ

image

అమలాపురానికి చెందిన మహబూబ్ షాహీరా, షకీలా సోదరీమణులు పరుగు పందేల్లో రికార్డులు సృష్టిస్తున్నారు. 76 ఏళ్ల షాహీరా తన 16వ ఏట మొదలుపెట్టిన పరుగును 60 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. గతేడాది పుణే మాస్టర్ అథ్లెటిక్స్‌లో ఆమె ప్రథమ స్థానం సాధించారు. షకీలా అథ్లెటిక్స్‌తో పాటు బాస్కెట్‌బాల్‌లోనూ జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సత్తా చాటారు. వీరిద్దరూ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.