News November 19, 2025
KNL: పిల్లల హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కన్నబిడ్డలను చంపిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2018లో సింధ్ ధనోజీ రావు తన కూతురు నిఖిత (7), కొడుకు మధు చరణ్ (4)ను నంద్యాల జిల్లాలోని జూపాడుబంగ్లా ప్రాంతంలో నీటి కుంటలో ముంచి చంపాడు. ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో కర్నూలులోని 7వ న్యాయస్థానం జడ్జి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News March 22, 2026
సిద్దిపేట: ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రావడం లేదు: హరీశ్ రావు

సిద్దిపేట జిల్లా నర్మెటలో ప్రారంభించనున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ప్రజాప్రతినిధుల ఫోటోలు లేవన్నారు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవాన్ని పార్టీ కార్యక్రమంలా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి రావడంలేదని స్పష్టం చేశారు.
News March 22, 2026
యుద్ధం.. కాసేపట్లో ప్రధాని మోదీ కీలక భేటీ

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ కాసేపట్లో సీనియర్ మంత్రులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. పెట్రోలియం, పవర్, ఫెర్టిలైజర్ మంత్రులు పాల్గొననున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా నిరంతరాయంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎరువుల సరఫరా, సరకు రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడటమే మీటింగ్ ఉద్దేశమని తెలిపాయి. అలాగే ఇటీవల ఇరాన్ ప్రెసిడెంట్తో మాట్లాడిన అంశాలపైనా మోదీ చర్చించే అవకాశం ఉంది.
News March 22, 2026
నర్మెటకు చేరుకున్న సీఎం

సిద్ధిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెటకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు తుమ్మల, దామోదర రాజనరసింహ, పొంగులేటి హాజరయ్యారు. సీఎం టీజీ ఆయిల్ పామ్ కార్మాగారాన్ని ప్రారంభించి, రిఫైనరీకి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.


