News April 13, 2024
మా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయదు: మంత్రి శ్రీధర్ బాబు

TG: ఫోన్ ట్యాపింగ్ వివాదం నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయదన్నారు. అలాంటి సంస్కృతి తమది కాదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పోటీయే కాదని.. 12 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతోందని.. ఇందులో ఎవరున్నా బయటకు వస్తారని తెలిపారు.
Similar News
News March 22, 2026
కృష్ణా: ‘బెట్టింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపండి’

IPL మొదలుకానున్న నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠాల కదలికలపై నిఘా ఉంచాలని ప్రజలు అంటున్నారు. గతంలో బయటపడిన ప్రధాన బుకీల నెట్వర్క్లో పెడనకు చెందిన వారి పేర్లు ఉండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల గన్నవరంలో బెట్టింగ్ వ్యసనం కారణంగా ఓ యువకుడు బలైన ఘటన మరువకముందే, మరో సీజన్ ప్రారంభం కానుండటం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకొని నిఘా ఏర్పాటు చేయాలని కోరారు.
News March 22, 2026
TDR పాలసీలో కీలక మార్పులు

TG: భవన నిర్మాణాల్లో ట్రాన్స్ఫరేబుల్ డెవలప్మెంట్ రైట్స్(TDR) వినియోగానికి సంబంధించి ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. 21mకు పైబడిన భవనాలను హై-రైజ్ భవనాలుగా గుర్తించనుంది. 750-2000చ.మీ ప్లాట్లలో 18-21m భవనాలకు TDR తప్పనిసరి చేసింది. నాన్ హై రైజ్ బిల్డింగ్స్కు సెట్ బ్యాక్ సడలించింది. హై రైజ్ భవనాల్లో 10% వరకు సెట్ బ్యాక్ రిలాక్షేషన్కు, 2000 చ.మీ ప్లాట్లలో అదనపు అంతస్తులకు అవకాశం కల్పించింది.
News March 22, 2026
జనసేన MLA బాలరాజుకు రూ.12లక్షలు టోకరా

AP: పోలవరం జనసేన MLA చిర్రి బాలరాజుకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఆర్టీఏ చలానా పేరుతో ఓ లింక్ పంపారు. దాన్ని క్లిక్ చేయగానే ఆయన ఖాతా నుంచి రూ.12లక్షలను మాయం చేశారు. మోసపోయినట్లు గుర్తించిన MLA వెంటనే జీలుగుమల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక SMలో షేర్ అయ్యే APK ఫైళ్లు, లింక్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఇప్పటికే హెచ్చరించారు.


