News November 19, 2025
మర్రిపాడు: నవోదయ విద్యార్థిని ఆత్మహత్య..UPDATE

మర్రిపాడు మండలం, కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో దారుణం చోటు చేసుకుంది.10వ తరగతి చదువుతున్న ప్రణీత (14) అనే విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అర్ధరాత్రి 2 సమయంలో మెట్ల కమ్ములకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలికను చూసి ఆయమ్మ ప్రిన్సిపల్కి సమాచారం ఇచ్చింది. బాలిక ప్రణీత కావలి రూరల్ అడవిరాజుపాలెం గ్రామం. బాలిక తండ్రి కొండాపురం ఎంఈఓగా పనిచేస్తున్నారు.
Similar News
News March 25, 2026
నెల్లూరులో ఇద్దరు అధికారులపై వేటు

నెల్లూరు శిక్షణ కార్యక్రమాల నిర్వహణ ఖర్చుల విషయంలో అవకతవకలు జరగడంతో ZP ఏవో RPS వర్మను సస్పెండ్ చేస్తూ జడ్పీ సీఈవో శ్రీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే శిక్షణ కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, అధిక బిల్లులు సమర్పించిన డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ యహోషువాను APSIRDకి సరెండర్ చేశారు. ట్రైనింగ్ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడడంతో చర్యలు తీసుకున్నారు.
News March 25, 2026
నెల్లూరు జిల్లా MLAలకు టెన్షన్.. టెన్షన్!

నెల్లూరు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన కొందరు MLAల్లో టెన్షన్ రేపుతోంది. ప్రస్తుతం గూడూరు ఒక్కటే SC నియోజకవర్గం. పునర్విభజనలో జనరల్ స్థానాలను SC, STలతో పాటు మహిళలకు రిజర్వ్ చేస్తే కొత్త సీటు కోసం ఇప్పటి MLAలకు వెతుకులాట తప్పదు. వీటితో పాటు నియోజకవర్గాలు ముక్కలై, కొత్త మండలాలు కలిసే అవకాశం ఉంటుంది. ఆ మండలాలపై పట్టు సాధించాలంటే ప్రస్తుత MLAలకు ఓ కఠిన పరీక్షే.
News March 25, 2026
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : మెప్మా పీడీ

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరించాలని మెప్మా పీడీ లీలారాణి అధికారులకు సూచించారు. మంగళవారం బుచ్చి మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ధాన్యం మండీలను వ్యవసాయ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలులో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద ధాన్యం సేకరించాలని తెలిపారు.


