News November 19, 2025

ములుగు: లొంగిపోతారా? ఉద్యమం కొనసాగిస్తారా?

image

ఆపరేషన్ కగార్ పేరిట వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కీలక బాధ్యతలు వహిస్తున్న బడే చొక్కారావు @ అలియాస్ దామోదర్ సురక్షితంగానే ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది. 1997లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన.. హిడ్మా ఎన్కౌంటర్‌తో ఆయన పోలీసులకు లొంగిపోతారా? ఉద్యమం కొనసాగిస్తారా? అనేది చూడాలి.

Similar News

News March 22, 2026

KMR: చారిత్రక నేపథ్యం ఉన్న కౌలాస్ కోటను మీరు చూశారా..!

image

KMR జిల్లాలో చారిత్రక నేపథ్యం కలిగిన జుక్కల్ మండలంలోని కౌలాస్ కోట ప్రాచుర్యం పొందింది. అటవీ ప్రాంతంలో పచ్చని చెట్ల మధ్య, కొండల నడుమ చూడ చక్కని పర్యాటక ప్రదేశంగా విరసిల్లుతోంది. కాకతీయుల నుంచి మొదలుకొని నిజాం పాలకుల వరకు ఈ కోటను వినియోగించుకున్నారు. కోట చుట్టూ కలిగిన ప్రకృతి సౌందర్య దృశ్యాలు, కోట లోపల దేవాలయాలు, దర్గాలు, పురాతన కట్టడాలు ఉన్నాయి. పలు ప్రాంతాల నుంచి విహారయాత్రకు ఇక్కడికి వస్తారు.

News March 22, 2026

బందరులో YCP ఫ్లెక్సీ చించివేత..!

image

బందరులోని 33వ డివిజన్ చింత చెట్టు సెంటర్‌లో ఏర్పాటు చేసిన YCP ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించి వేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా వైసీపీ మాజీ కార్పొరేటర్ అజ్గర్ డివిజన్ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దానిని గుర్తుతెలియని వ్యక్తులు చించి వేయడం పలు రాజకీయ విమర్శలకు దారి తీసింది. ఈ ఘటనపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News March 22, 2026

రైతుల కోసం టెలీ-మానస్ హెల్ప్ లైన్ : ADB కలెక్టర్

image

మానసిక ఒత్తిడితో బాధపడుతున్న రైతులు, వారి కుటుంబసభ్యులు ప్రభుత్వం అందిస్తున్న టెలీ-మానస్ (Tele-MANAS) హెల్ప్‌లైన్ 14416 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఈ నంబర్‌కు కాల్ చేసి నిపుణులైన కౌన్సిలర్ల ద్వారా ఉచిత సలహాలు పొందవచ్చని తెలిపారు. గ్రామ స్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఈ సేవలపై అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. రైతులు మానసిక ఒత్తిడికి గురికావద్దన్నారు.