News November 19, 2025
ములుగు: లొంగిపోతారా? ఉద్యమం కొనసాగిస్తారా?

ఆపరేషన్ కగార్ పేరిట వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కీలక బాధ్యతలు వహిస్తున్న బడే చొక్కారావు @ అలియాస్ దామోదర్ సురక్షితంగానే ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది. 1997లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన.. హిడ్మా ఎన్కౌంటర్తో ఆయన పోలీసులకు లొంగిపోతారా? ఉద్యమం కొనసాగిస్తారా? అనేది చూడాలి.
Similar News
News March 20, 2026
పాక్-అఫ్గాన్.. సోదరుల్లా ఉండండి: ఖమేనీ

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సోదరుల్లా ఉండాలి. మంచి సంబంధాలు ఏర్పర్చుకోండి. ముస్లింల మధ్య విభేదాలు రాకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని ఖమేనీ చెప్పినట్లు తెలుస్తోంది.
News March 20, 2026
లక్ష్యాలను అధిగమించండి: అన్నమయ్య కలెక్టర్

రెవెన్యూ శాఖ తమ ఆదాయ లక్ష్యాలను అధిగమించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మదనపల్లెలోని కలెక్టరేట్ ఆయన సమీక్షించారు. ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణ, మైనింగ్, రిజిస్ట్రేషన్, అటవీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. వాణిజ్య కార్యకలాపాలు, వస్తువుల సేవల వినియోగంపై జీఎస్టీ వసూళ్లు పక్కాగా జరగాలని ఆదేశించారు.
News March 20, 2026
లక్ష్యాలను అధిగమించండి: అన్నమయ్య కలెక్టర్

రెవెన్యూ శాఖ తమ ఆదాయ లక్ష్యాలను అధిగమించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మదనపల్లెలోని కలెక్టరేట్ ఆయన సమీక్షించారు. ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణ, మైనింగ్, రిజిస్ట్రేషన్, అటవీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. వాణిజ్య కార్యకలాపాలు, వస్తువుల సేవల వినియోగంపై జీఎస్టీ వసూళ్లు పక్కాగా జరగాలని ఆదేశించారు.


